డెవిల్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. 2023 లో ఆయన చివరి సినిమా డెవిల్ రిలీజ్ అయి కళ్యాణ్ రామ్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారట. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రానుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది. యాక్షన్ సినిమా కావడంతో టైటిల్ సెట్ అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు యూనిట్ నుండి అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకు ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నారు అని దాదాపు ఇదే ఖాయమని తెలిసింది. ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి మరోసారి పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.