Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిజె టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ టిల్లు స్క్వేర్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాత నాగ వంశీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి మీడియా కోసం ఎలాంటి స్పెషల్ షో వేయడం లేదు.
Bade Miyan Chote Miyan Trailer: ఈ ప్రపంచం ఇంతవరకు ఇలాంటి యుద్దాన్ని చూసి ఉండదు!
Also Read
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
- LENIN : అఖిల్ 'లెనిన్' ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
- Obsession Heroine : 'అబ్సెషన్' గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న మీడియా కోసం ఒక ప్రెస్ ప్రీమియర్ ప్రదర్శించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సినిమాలను ముందు రోజే మీడియా కోసం ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలను మాత్రం రిలీజ్ అయిన రోజు ఉదయం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి స్పెషల్ ప్రీమియర్ వేయకూడదు అని నాగవంశీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలా ఏ సినిమా నిర్మాత ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. కొంత కాలం క్రితం ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ సమయంలో పూరీ జగన్నాథ్ మాత్రమే ప్రెస్ కి షో వేయలేదు. సినిమా మీద నమ్మకంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పాటు రివ్యూస్ మీద కాస్త నెగటివ్ అభిప్రాయం కలిగిన నాగ వంశీ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమే కాగా నిజంగా ప్రెస్ ప్రీమియర్ ప్లాన్ చేయలేదా ? అనే విషయం మీద రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!