Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Media Show for Tillu Square: డిజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా తెరకెక్కింది. మొదటి సినిమాలో హీరోగా నటించిన సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తుండగా హీరోయిన్ మాత్రం మారింది. మొదటి భాగంలో నేహా శెట్టి రాధిక అనే పాత్రలో కనిపించగా ఇప్పుడు లిల్లీ అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డిజె టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ టిల్లు స్క్వేర్ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విషయంలో నిర్మాత నాగ వంశీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి మీడియా కోసం ఎలాంటి స్పెషల్ షో వేయడం లేదు.
Bade Miyan Chote Miyan Trailer: ఈ ప్రపంచం ఇంతవరకు ఇలాంటి యుద్దాన్ని చూసి ఉండదు!
Also Read
- Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
సాధారణంగా తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న మీడియా కోసం ఒక ప్రెస్ ప్రీమియర్ ప్రదర్శించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సినిమాలను ముందు రోజే మీడియా కోసం ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని సినిమాలను మాత్రం రిలీజ్ అయిన రోజు ఉదయం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి స్పెషల్ ప్రీమియర్ వేయకూడదు అని నాగవంశీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలా ఏ సినిమా నిర్మాత ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. కొంత కాలం క్రితం ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ సమయంలో పూరీ జగన్నాథ్ మాత్రమే ప్రెస్ కి షో వేయలేదు. సినిమా మీద నమ్మకంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పాటు రివ్యూస్ మీద కాస్త నెగటివ్ అభిప్రాయం కలిగిన నాగ వంశీ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమే కాగా నిజంగా ప్రెస్ ప్రీమియర్ ప్లాన్ చేయలేదా ? అనే విషయం మీద రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!