Naga Chaitanya: రియల్ ఇన్సిడెంట్స్ తో చైతూ-చందూ సినిమా… అతని జీవితం ఆధారంగానే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya Interacts with fishermen families for Chandoo Mondeti Film: అక్కినేని నాగచైతన్య ఓ సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అల్లు అరవింద్, బన్నీవాసుల గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో చైతన్య ఈ సినిమా చేయబోతున్నాడు. కార్తికేయ2 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ చందూ మొండేటి ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేస్తుండగా త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా నిర్మాత బన్నీ వాసు, నాగచైతన్య, చందు మొండేటి ఎచ్చెర్ల మండలం కె.మత్స్యలేశం గ్రామంలో పర్యటించి వాళ్లు సముద్రంలో తప్పిపోయి పాకిస్తాన్ వెళ్లిన సంఘటనల వివరాలు తెలుసుకున్నారు. నిజానికి ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతుందని చైతన్య జాలరిగా కనిపిస్తాడని ముందే క్లారిటీ ఇచ్చారు. గుజరాత్లో జరిగిన కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేయబోతున్నట్టు కూడా అప్పట్లో జరిగింది. ఇక తాజాగా ఈ విషయం మీద నాగ చైతన్య మాట్లాడుతూ సుమారు ఆరు నెలల క్రితం చందూ మొండేటి నాకు ఈ కథ చెప్పారని, ఈ కథ స్ఫూర్తి నింపిందని అన్నారు.
Jailer: రజనీ ‘జైలర్’ అక్కడి నుంచే ఎత్తుకొచ్చారా?
Also Read
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
- Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
మత్స్యకారుల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. ఇక ఇదే క్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ నిజ జీవితంలో జరిగిన కథను గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందిస్తున్నామని, వాస్తవిక పరిస్థితులకు దగ్గరగా చూపించనున్నామని అన్నారు. సిక్కోలు మత్స్యకారుల యాస, భాష, వ్యవహార శైలిని అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రాంతానికి వచ్చామని పేర్కొన్న ఆయన ఒక మంచి లవ్స్టోరీని సైతం ఈ సినిమాలో చూపించనున్నామని అన్నారు. 2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్లి పాక్ కోస్ట్ గార్డ్కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. శ్రీకాకుళం మత్స్యకారులు గుజరాత్ దాకా పనికోసం వలస వెళ్లడం ఫిషింగ్ చేస్తూ పాక్కు చిక్కడం, అక్కడి నుంచి భారత్కు రావడం వంటి అంశాలను సినిమాటిక్ గా గుండెలకు హత్తుకునేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..