Mega Charan : మెగాస్టార్ – చరణ్.. ఆ రెండు ఫేక్.. ఫ్యాన్స్ హ్యాపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్స్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘దసరా’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ చుట్టూ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ తెగ వైరల్ అవుతోంది. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల ఒక భారీ పీరియాడిక్ మాస్ డ్రామాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా, చిరంజీవితో కాకుండా రామ్ చరణ్ హీరోగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను రీ-ప్లాన్ చేస్తున్నారనే సరికొత్త ప్రచారం కూడా మొదలైంది.
మెగా కాంబోల గురించి వస్తున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ మునుపటి కమిట్మెంట్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 158వ ప్రాజెక్ట్ చేస్తున్నారు . ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడమే టార్గెట్ గా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నారు.
Also Read
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం తన తదుపరి ప్రాజెక్ట్ తో బిజీగా గడుపుతున్నారు. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఆయన ‘ది పారడైజ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో అనుకున్న మెగా మాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఆగిపోయిందనడంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ‘పెద్ది’ సినిమా షూటింగ్ తర్వాత ఆయన లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తన 17వ చిత్రాన్ని (RC 17) చేయనున్నారు . ప్రస్తుతం సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వీరి కాంబోలో వచ్చిన బ్లాక్బస్టర్ హిట్ ‘రంగస్థలం’ సినిమాను మించేలా ఈ కొత్త కథ ఉండబోతోందని టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి చిరంజీవి, రామ్ చరణ్, శ్రీకాంత్ ఓదెల సినిమా గురించి నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని తేలిపోయింది.
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!