మెగాస్టార్ ఔదార్యం.. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి ఆపన్న హస్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఔదార్యం చూపించారు. మెగా అభిమానుల క్షేమం కోసం పరితపించే ఆయన.. తాజాగా ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖకు చెందిన వెంకట్ అనే మెగా అభిమాని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని ఆకాంక్షించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. పలువురు అభిమానులు మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి సదరు అభిమాని తనను కలవొచ్చని తెలిపారు. అయితే అభిమాని వెంకట్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో రైలు, బస్సు ద్వారా హైదరాబాద్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో చిరంజీవి పెద్దమనసుతో వ్యవహరించారు. వెంకట్, అతడి భార్య సుజాత విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేయించారు.
Read Also: సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న “ఎఫ్ 3”
Also Read
ఈ నేపథ్యంలో శనివారం నాడు వెంకట్ తన భార్యతో కలిసి మెగాస్టార్ను కలిశాడు. తన ఇంటికి వచ్చిన అభిమాని కుటుంబాన్ని చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. వెంకట్ అనారోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం అభిమాని కుటుంబాన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పంపారు. మెడికల్ రిపోర్టులపై అక్కడి వైద్యులతో చిరంజీవి స్వయంగా మాట్లాడారు. అనంతరం వెంకట్ విశాఖలోనే చికిత్స పొందవచ్చని.. వైద్యానికి అయ్యే ఆస్పత్రి ఖర్చులను తానే భరిస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చారు. కావాలంటే మెరుగైన చికిత్స కోసం తానే చెన్నై పంపిస్తానని తెలిపారు. దీంతో అభిమాని పట్ల చిరంజీవి చూపించిన ఔదార్యానికి ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు.
Annayya @KChiruTweets garu has Met Fan Venkat from Vizag at his Residence. And Assured complete support for his Medical Treatments. #MegastarChiranjeevi
Jai Chiranjeeva pic.twitter.com/5JdyrtVAYN— Megastar Chiranjeevi (@ChiruFanClub) October 24, 2021
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!