Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు. నేను ఆమెను రేప్ చేసే సీన్స్ ఏమైనా పెడతారేమో అనుకున్నాను అని వివాదాన్ని మొదలుపెట్టాడు. ఒక నటిని.. ఇలా అనడం సరికాదని త్రిషతో పాటు ఇండస్ట్రీ అంతా మన్సూర్ ను ఏకిపారేసింది. అతనిది వక్రబుద్ధి అని, అతనిని బ్యాన్ చేయడమే కాకుండా.. అతడిపై కేసు కూడా పెట్టారు. ఇక కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. టాలీవుడ్ నుంచి హీరోయిన్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకు సపోర్ట్ గా నిలిచాడు. మన్సూర్ ఆలీఖాన్ అలా మాట్లాడడం తప్పు అని.. అతనిది వక్రబుద్ధి అంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా మనూస్ర్ ఆలీఖాన్ .. చిరు వ్యాఖ్యలపై స్పందించాడు. తనపై ట్వీట్ చేసిన త్రిష, చిరంజీవి, ఖుష్బూ లపై పరువునష్టం దావా వేస్తాను అని చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది.
Malla Reddy: మల్లారెడ్డి మాటలకు హర్టయిన బాలీవుడ్?
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడుతూ.. ” చిరంజీవి నన్ను తప్పు పడుతూ ట్వీట్ వేశారు. ఆయన పెద్ద నటుడు, పొలిటికల్ పార్టీ కూడా నడిపినవారు. నేను ఆయనతో కలిసి పనిచేసాను. అలాంటి వ్యక్తి.. ట్వీట్ వేసేముందు.. ఒక్కసారి నాకు కాల్ చేసి అడగాల్సింది. మన్సూర్ గారు.. అసలు జరిగింది ఏంటి.. ? ఇలా ట్వీట్ వేస్తున్నా.. ? నిజానిజాలు తెలుసుకొని వేయాల్సింది. నాది వక్రబుద్ధి అని ఆయన చెప్తున్నారు.. మరి ఆయనది ఏంటి.. ? రాజకీయాల పేరుతో ఎంతోమంది పార్టీల దగ్గర డబ్బు తీసుకొని ప్రజలకు ఏం చేయకుండా ఆయనే వాడుకున్నారు. అవన్నీ నేను అడగాలా.. ? అందుకే నేను వారి మీద పరువు నష్టం కేసు వేస్తున్నా.. త్రిష పది కోట్లు.. ఖుష్బూ పదికోట్లు.. చిరంజీవి.. 20 కోట్లు ఇవ్వాలి. వారు ఇచ్చిన డబ్బును.. నేను తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తాను. ఇది దేవుడి మీద ఒట్టు. చిరంజీవి తప్పు చేసాడు. నన్ను అడగకుండా.. నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్ ఎలా చేస్తాడు..?” అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Whats App Update: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!