Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoor Ali Khan: కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాడు. ఏ ముహూర్తాన.. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడో.. అప్పటినుంచి మన్సూర్ పేరు మారుమ్రోగిపోతుంది. లియో సినిమాలో త్రిషతో సన్నివేశాలు ఉన్నాయా.. ? అన్న ప్రశ్నకు మన్సూర్ .. త్రిషతో తనకు ఎలాంటి సీన్స్ లేవు. నేను ఆమెను రేప్ చేసే సీన్స్ ఏమైనా పెడతారేమో అనుకున్నాను అని వివాదాన్ని మొదలుపెట్టాడు. ఒక నటిని.. ఇలా అనడం సరికాదని త్రిషతో పాటు ఇండస్ట్రీ అంతా మన్సూర్ ను ఏకిపారేసింది. అతనిది వక్రబుద్ధి అని, అతనిని బ్యాన్ చేయడమే కాకుండా.. అతడిపై కేసు కూడా పెట్టారు. ఇక కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. టాలీవుడ్ నుంచి హీరోయిన్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషకు సపోర్ట్ గా నిలిచాడు. మన్సూర్ ఆలీఖాన్ అలా మాట్లాడడం తప్పు అని.. అతనిది వక్రబుద్ధి అంటూ ట్వీట్ చేశాడు. ఇక తాజాగా మనూస్ర్ ఆలీఖాన్ .. చిరు వ్యాఖ్యలపై స్పందించాడు. తనపై ట్వీట్ చేసిన త్రిష, చిరంజీవి, ఖుష్బూ లపై పరువునష్టం దావా వేస్తాను అని చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది.
Malla Reddy: మల్లారెడ్డి మాటలకు హర్టయిన బాలీవుడ్?
Also Read
- Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. 'రొమాంచకం' నుంచి 'రాధా రమణ' పాట రిలీజ్!
- RAW NTR: ఊహించని ట్విస్ట్.. 'రా ఎన్టీఆర్'కు గుడ్బై.. అసలు ఏమైంది?
- Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
- Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడుతూ.. ” చిరంజీవి నన్ను తప్పు పడుతూ ట్వీట్ వేశారు. ఆయన పెద్ద నటుడు, పొలిటికల్ పార్టీ కూడా నడిపినవారు. నేను ఆయనతో కలిసి పనిచేసాను. అలాంటి వ్యక్తి.. ట్వీట్ వేసేముందు.. ఒక్కసారి నాకు కాల్ చేసి అడగాల్సింది. మన్సూర్ గారు.. అసలు జరిగింది ఏంటి.. ? ఇలా ట్వీట్ వేస్తున్నా.. ? నిజానిజాలు తెలుసుకొని వేయాల్సింది. నాది వక్రబుద్ధి అని ఆయన చెప్తున్నారు.. మరి ఆయనది ఏంటి.. ? రాజకీయాల పేరుతో ఎంతోమంది పార్టీల దగ్గర డబ్బు తీసుకొని ప్రజలకు ఏం చేయకుండా ఆయనే వాడుకున్నారు. అవన్నీ నేను అడగాలా.. ? అందుకే నేను వారి మీద పరువు నష్టం కేసు వేస్తున్నా.. త్రిష పది కోట్లు.. ఖుష్బూ పదికోట్లు.. చిరంజీవి.. 20 కోట్లు ఇవ్వాలి. వారు ఇచ్చిన డబ్బును.. నేను తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తాను. ఇది దేవుడి మీద ఒట్టు. చిరంజీవి తప్పు చేసాడు. నన్ను అడగకుండా.. నిజానిజాలు తెలుసుకోకుండా ట్వీట్ ఎలా చేస్తాడు..?” అని ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!