Malayalam film director Sudheer Bose passes away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు సుధీర్ బోస్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం ఆయన కన్నుమూశారు. సుధీర్ బోస్ కు భార్య ప్రీత, పిల్లలు మిథున్, సౌపర్ణిక ఉన్నారు.
Kalki 2898 AD: ఐదు రోజులు 625 కోట్లు.. కల్కి అరాచకం!
2008లో, సుధీర్ అలాగే మను కలిసి కళాభవన్ మణి, ముఖేష్ మరియు రంభ ప్రధాన పాత్రలలో ‘కబడ్డీ కబడ్డీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుధీర్ తిరువనంతపురంలోని పడింజరెనాడలో ఉండేవాడు. ఆయన బంధువులు ఇతర దేశాల నుంచి రావాల్సి ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. సుధీర్ బోసు డైరెక్టర్గా మారకముందు అనేక సినిమాలకు ఆయన పలు స్టార్ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. ఆయన మృతి నేపథ్యంలో పలువురు మలయాళ సినీ నటీనటులు ఇతర టెక్నీషియన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణ వార్తను FEFKA డైరెక్టర్స్ యూనియన్ అధికారిక Facebook హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు.