“ఎస్ఎస్ఎంబి 28” అప్డేట్… గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడింది. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాను “ఎస్ఎస్ఎంబి 28” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంగీత సంచలనం ఎస్.ఎస్.తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
Read Also : “విజయ్ దేవరకొండ తుఫాన్” స్టార్ట్… పేరు మార్చుకున్న హీరో
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రారంభోత్సవం ఫిబ్రవరి మూడో తేదీన అంటే గురువారం నాడు హైదరాబాద్ లో వైభవంగా జరగనుంది. అయితే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఇంకా పూర్తి కాని ఈ నేపథ్యంలో రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పూజా హెగ్డే ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ను ఎంపిక చేసుకోవడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించనున్నారు. ఇందులో మహేష్ కొత్త లుక్లో కనిపించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!