MAA President Vishnu Manchu met Deputy CM Mallu Bhatti Vikramarka: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున బహుమతి అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద విష్ణు మంచు, భట్టి విక్రమార్క చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు మంచు విష్ణు ట్వీట్ చేస్తూ ‘తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం.
Upasana Kamineni తాత పుట్టినరోజు.. ది అపోలో స్టోరీ లాంచ్ చేసిన ఉపాసన
తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామ’ని విష్ణు మంచు తెలిపారు. ఇక మంచు విష్ణు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కన్నప్ప’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్లో భారీ షెడ్యూల్ను పూర్తి చేసుకుని చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.