Koratala Siva : లైన్ లో మరో ఇద్దరు స్టార్ హీరోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మావెరిక్ దర్శకుడు కొరటాల శివ ఖాతాలో పలు ఆసక్తికరమైన చిత్రాలున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉండగా, నెక్స్ట్ ‘ఎన్టీఆర్ 30’తో బిజీ కానున్నాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొరటాల మరో ఇద్దరు స్టార్ హీరోలను కూడా లైన్ లో పెట్టినట్లు వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ కావడం విశేషం.
Read Also : Ajay Devgan: హానికరం అయితే ఎందుకు అమ్ముతున్నారు..?
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
కొరటాల మాట్లాడుతూ “మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాను. మేము ఇప్పటికే రెండు సినిమాలు చేశాము. ఆ రెండు సినిమాలూ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్. కాబట్టి నెక్స్ట్ మా కాంబో రిపీట్ కాబోతోందని వార్తలు రావడం సహజం. అయితే మేమిద్దరం కలిసి ఖచ్చితంగా ఒక సినిమా చేస్తున్నాము. అది హ్యాట్రిక్ అవుతుంది” అని మహేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు కొరటాల శివ. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ టైం కాదని అన్నారు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో కూడా సినిమాలు చేయబోతున్నాను అని, అయితే వారి డేట్స్ ఎప్పుడు కుదురుతాయనేది తెలియదని అన్నారు. అంటే ముగ్గురు స్టార్ హీరోలలో ఎవరి డేట్స్ ముందుగా దొరికితే వారితో కొరటాల మూవీ ఉంటుందన్న మాట. ఇక ఏప్రిల్ 29న కొరటాల దర్శకత్వలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?