హీరోయిన్ లంటే… అవసరం, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే మిగిలిన హీరోయిన్ ల నుంచి వీళ్లని సెపరేట్ చేస్తుంది. మంచి క్యారెక్టర్స్ పైన మాత్రమే ఫోకస్ చేసే వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ బొద్దుగుమ్మను హోమ్లీ బ్యూటీగానే చూశారు ఆడియెన్స్. మిగతా వాళ్లకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ మెల్లిమెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్ చేసింది కీర్తి సురేష్. మహానటి సినిమా తర్వాత ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోని, కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్న ఈ హీరోయిన్ సర్కారు వారి పాట సినిమాతోనే యూటర్న్ తీసుకోని గ్లామర్ ట్రాక్ ఎక్కింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాలోనే గ్లామర్ షో చేస్తుంది కీర్తి. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతునే ఉన్న కీర్తి, లేటెస్ట్ గా ఒక ఈవెంట్ లో చేసిన స్కిన్ షో చూసి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. తాజాగా కీర్తి హాట్ లుక్కు సోషల్ మీడియా హీటెక్కిపోతోంది.
బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ ‘హీరామండి’ సిరీస్ లాంచింగ్ సందర్భంగా గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమీర్ ఖాన్, కరణ్ జోహార్, కృతి సనన్, రానా, వెంకటేష్, కీర్తి సురేష్తో పాటు పలువురు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. అయితే వీరందరిలో కీర్తి సురేష్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. మల్టీ కలర్డ్ దుస్తుల్లో కాస్త బోల్డ్గా మెరిసింది కీర్తి. దాంతో అమ్మడి హాటు ఫొటోలు ట్రెండింగ్లోకి వచ్చేశాయి. ఆ మధ్యలో జిమ్ ఎక్కువగా చేసి, బక్కచిక్కినట్లు ఉన్న కీర్తి సురేష్ ని చూసి, ఇలా అయిపోతుంది ఏంటి? క్యూట్ గా ఉండే ఒకప్పటి కీర్తి సురేష్ ఇక కనిపించదా అనుకున్నారు? క్యూట్ గా కాదు హాట్ గా కనిపిస్తాను అంటూ కీర్తి సురేష్ మోడరన్ ఫోటోస్ తో యూత్ హార్ట్స్ కి గెలిచేసింది. ఈ బోల్డ్ ఫోటోస్ తో కీర్తి సురేష్ బ్యాక్ టు ఫామ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని సరసన ‘దసరా’ చిత్రంలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న బోళా శంకర్ సినిమాలో చెల్లెలి పాత్ర చేస్తోంది. వీటితో పాటు సైరెన్, రివాల్వర్ రీటా అనే సినిమాలు చేస్తోంది.