Keerthy Suresh: ‘మహానటి’గానే జనం మదిలో.. కీర్తి సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh:’మహానటి’ అన్న పదం సావిత్రి ఇంటిపేరుగా నిలచింది. తెరపై సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ పేరు ముందు కూడా ఇప్పుడు ‘మహానటి’ చేరిపోయింది. అంతలా సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేశ్ కు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు కూడా లభించింది. దాంతో కీర్తి గ్లామర్ రోల్స్ లో కనిపించినా సరే, జనం మాత్రం ఆమెను ‘మహానటి’ అనే పిలుస్తున్నారు.
చిరంజీవి నటజీవితంలో మరపురాని చిత్రాల్లో ‘పున్నమినాగు’ ప్రధానమైనది. అందులో ఆయన సరసన నాయికగా నటించిన మేనక కూతురే కీర్తి సురేశ్. ఆమె తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు. మేనక, సురేశ్ కుమార్ దంపతులకు 1992 అక్టోబర్ 17న కీర్తి సురేశ్ జన్మించింది. చెన్నైలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టా పుచ్చుకుంది కీర్తి సురేశ్. ఆమెకు వయోలిన్ వాయించడంలోనూ ప్రావీణ్యం ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ లో సీరియస్ గా సాగాలనుకుంది కీర్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో “పైలట్స్, అచనేయనేనిక్కిష్టమ్, కుబేరన్”వంటి మళయాళ చిత్రాలలో బాలనటిగా నటించింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘గీతాంజలి’ అనే హారర్ ఫిలిమ్ లో ద్విపాత్రాభినయం చేస్తూ నాయికగా పరిచయమైంది కీర్తి. తెలుగులో ‘నేను శైలజ’లో రామ్ సరసన నటించి, ఇట్టే తెలుగువారిని ఆకట్టుకుంది. నానితో కలసి ‘నేను లోకల్’లో ముద్దుగా మురిపించింది. ‘అజ్ఞాతవాసి’లో పవన్ కళ్యాణ్ తోనూ నటించింది. ఇక సావిత్రి జీవితగాథగా తెరకెక్కిన ‘మహానటి’లో జీవించేసింది కీర్తి. అందువల్లే ఆ యేడాది అత్యుత్తమనటిగా జాతీయ స్థాయిలో నిలచింది. ‘మన్మథుడు-2’లో ప్రత్యేక పాత్రలో కనిపించింది కీర్తి. “పెంగ్విన్, మిస్ ఇండియా” వంటి ఓటీటీ మూవీస్ లోనూ కీర్తి అభినయం ఆకట్టుకుంది. ‘జాతిరత్నాలు’లో కాసేపే కనిపించినా, కవ్వించింది. ‘రంగ్ దే’లో నితిన్ తో జోడీ కట్టి మరోమారు నటనతో ఆకట్టుకుంది. మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ గ్లామర్ ఒలకబోసిన ‘సర్కారువారి పాట’ సైతం అలరించింది. ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖీ’ కూడా మురిపించింది.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో 'రష్మిక మందన్న'
కీర్తి సురేశ్ నటించిన కొన్ని పరభాషా చిత్రాలు సైతం తెలుగులోకి అనువాదమై అలరించాయి. చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘భోళా శంకర్’లోనూ కీర్తి సురేశ్ కనిపించనుంది. నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘దసరా’లోనూ కీర్తి నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాలు కాక మరికొన్ని సినిమాల్లోనూ కీర్తి తనదైన అభినయంతో అలరించనుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రనూ అంగీకరించకుండా, మనసుకు నచ్చిన రోల్స్ ను ఎంపిక చేసుకొని సాగుతోంది కీర్తి. మరి రాబోయే చిత్రాలలో కీర్తి సురేశ్ ఏ రీతిన తన నటనతో మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!