Keerthy Suresh: ‘మహానటి’గానే జనం మదిలో.. కీర్తి సురేష్
Keerthy Suresh:’మహానటి’ అన్న పదం సావిత్రి ఇంటిపేరుగా నిలచింది. తెరపై సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ పేరు ముందు కూడా ఇప్పుడు ‘మహానటి’ చేరిపోయింది. అంతలా సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేశ్ కు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు కూడా లభించింది. దాంతో కీర్తి గ్లామర్ రోల్స్ లో కనిపించినా సరే, జనం మాత్రం ఆమెను ‘మహానటి’ అనే పిలుస్తున్నారు.
చిరంజీవి నటజీవితంలో మరపురాని చిత్రాల్లో ‘పున్నమినాగు’ ప్రధానమైనది. అందులో ఆయన సరసన నాయికగా నటించిన మేనక కూతురే కీర్తి సురేశ్. ఆమె తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు. మేనక, సురేశ్ కుమార్ దంపతులకు 1992 అక్టోబర్ 17న కీర్తి సురేశ్ జన్మించింది. చెన్నైలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టా పుచ్చుకుంది కీర్తి సురేశ్. ఆమెకు వయోలిన్ వాయించడంలోనూ ప్రావీణ్యం ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ లో సీరియస్ గా సాగాలనుకుంది కీర్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో “పైలట్స్, అచనేయనేనిక్కిష్టమ్, కుబేరన్”వంటి మళయాళ చిత్రాలలో బాలనటిగా నటించింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘గీతాంజలి’ అనే హారర్ ఫిలిమ్ లో ద్విపాత్రాభినయం చేస్తూ నాయికగా పరిచయమైంది కీర్తి. తెలుగులో ‘నేను శైలజ’లో రామ్ సరసన నటించి, ఇట్టే తెలుగువారిని ఆకట్టుకుంది. నానితో కలసి ‘నేను లోకల్’లో ముద్దుగా మురిపించింది. ‘అజ్ఞాతవాసి’లో పవన్ కళ్యాణ్ తోనూ నటించింది. ఇక సావిత్రి జీవితగాథగా తెరకెక్కిన ‘మహానటి’లో జీవించేసింది కీర్తి. అందువల్లే ఆ యేడాది అత్యుత్తమనటిగా జాతీయ స్థాయిలో నిలచింది. ‘మన్మథుడు-2’లో ప్రత్యేక పాత్రలో కనిపించింది కీర్తి. “పెంగ్విన్, మిస్ ఇండియా” వంటి ఓటీటీ మూవీస్ లోనూ కీర్తి అభినయం ఆకట్టుకుంది. ‘జాతిరత్నాలు’లో కాసేపే కనిపించినా, కవ్వించింది. ‘రంగ్ దే’లో నితిన్ తో జోడీ కట్టి మరోమారు నటనతో ఆకట్టుకుంది. మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ గ్లామర్ ఒలకబోసిన ‘సర్కారువారి పాట’ సైతం అలరించింది. ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖీ’ కూడా మురిపించింది.
Also Read
- Adivi Sesh: "నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?" అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
- Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
కీర్తి సురేశ్ నటించిన కొన్ని పరభాషా చిత్రాలు సైతం తెలుగులోకి అనువాదమై అలరించాయి. చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘భోళా శంకర్’లోనూ కీర్తి సురేశ్ కనిపించనుంది. నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘దసరా’లోనూ కీర్తి నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాలు కాక మరికొన్ని సినిమాల్లోనూ కీర్తి తనదైన అభినయంతో అలరించనుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రనూ అంగీకరించకుండా, మనసుకు నచ్చిన రోల్స్ ను ఎంపిక చేసుకొని సాగుతోంది కీర్తి. మరి రాబోయే చిత్రాలలో కీర్తి సురేశ్ ఏ రీతిన తన నటనతో మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chegg Downfall: ఒకప్పుడు ఎడ్టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
-
Electric Scooters: హీరో, టీవీఎస్, లేదా ఏథర్.. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
-
IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
-
APY Monthly Pension: ఇలా చేస్తే అందరికీ రూ.5,000 పెన్షన్.. రోజూ రూ.7 పొదుపుతోనే! మీరు ఇంకా చేరలేదా?
-
Paytm Payments Bank: బిగ్షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. బ్యాంక్ లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!