Karthikeya 2: యుంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది. బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటిన ఈ సినిమా ఇటీవలే ఓటిటీలోకి అడుగుపెట్టింది. అక్టోబర్ 5 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్ లో రచ్చలేపిన ఈ సినిమా ఓటిటీలో కూడా షేక్ చేస్తోంది. రికార్డుల మోత మోగిస్తోంది. స్ట్రీమింగ్ అయిన 48 గంటల్లోనే రూ. 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను సంపాదించుకొని రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా తెలిపింది.
శ్రీ కృష్ణుడు గురించి తెలిపి గొప్ప సినిమా అని, ఈ సినిమాను ఎన్నిసార్లు చూసిన ఇంకోసారి చూడాలనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తరువాత నిఖిల్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి. కార్తికేయ 2 తో మొదటిసారి పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. మరి ఈ సినిమా విజయం నిఖిల్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.