Movie Ticket Rates : కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం.. టాలీవుడ్ కొంప ముంచుతుందా..?
- టికెట్ రేట్లు తగ్గించే ఛాన్స్
- సినిమాలకు ప్రేక్షకులను దగ్గర చేస్తుందా
- టాలీవుడ్ నిర్మాతల ఆలోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Movie Ticket Rates : టాలీవుడ్ సినిమాలకు మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమాల టికెట్ రేట్లను చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో విధంగా ఉంటుంది. తెలంగాణలో పుష్ప-2 కంటే ముందు ఇష్టారీతిన రేట్లు పెంచుకునేవాళ్లు. సినిమా బడ్జెట్ ను బట్టి మల్టీ ప్లెక్సుల్లో టికెట్ రేటు మీద రూ.295 నుంచి రూ.350 వరకు పెంచుతున్నారు. సింగిల్ స్క్రీన్లలో 140 వరకు పెంచుకుంటున్నారు. అటు ఏపీలో మరీ అంత కాకపోయినా.. మల్టీ ప్లెక్సుల్లో రూ.180, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర సినిమాను బట్టి రూ.112 నుంచి 150 మధ్య ఉంటోంది.
Read Also : Anushka vs Rashmika : అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా..?
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
ఇలాంటి పద్ధతి మొన్నటి వరకు కర్ణాటకలో ఉండేది. కానీ తాజాగా కర్ణాటక ప్రభుత్వం అన్ని థియేటర్లలో ప్రతి సినిమాకు రూ.200లకు మించి టికెట్ రేట్ ఉండొద్దని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే పెరిగిన టికెట్ రేట్లు ఆడియెన్స్ ను థియేటర్లకు దూరం చేసేసింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే రూ.1000 వరకు పెట్టాల్సిందే. ఇంక థియేటర్ లో పాప్ కార్న్, తినే ఆహారాలు, కూల్ డ్రింక్ ల రేట్ల సంగతి అసలే చెప్పక్కర్లేదు. అందుకే ఈ రేట్లు పెరిగినప్పటి నుంచే ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా వరకు తగ్గిపోయింది. తెలంగాణ, ఏపీలో ఇదే పరిస్థితి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం త్వరలోనే ఏపీ, తెలంగాణలో కూడా వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ టికెట్ రేట్లపై పెద్ద హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా పదే పదే మాట్లాడుతున్నారు.
దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని నిర్మాతల మండలి కూడా చెబుతోంది. ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లను పెంచడం ఆపేశారు. కానీ మళ్లీ స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ కర్ణాటక తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో కూడా అలాంటి జీవో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో వస్తే ఆటోమేటిక్ గా ఏపీలోనూ అదే జరుగుతుంది. ఇది ఒక రకంగా సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేసే అవకాశం ఉంది. అది కూడా నిర్మాతలకు లాభమే. కానీ సినిమాలకు బడ్జెట్ ను తగ్గించుకుంటే లాభాలు ఊహించినదానికంటే ఎక్కువే ఉంటాయి.
Read Also : PV Sindhu: కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..