Movie Ticket Rates : కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం.. టాలీవుడ్ కొంప ముంచుతుందా..?
- టికెట్ రేట్లు తగ్గించే ఛాన్స్
- సినిమాలకు ప్రేక్షకులను దగ్గర చేస్తుందా
- టాలీవుడ్ నిర్మాతల ఆలోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Movie Ticket Rates : టాలీవుడ్ సినిమాలకు మళ్లీ పాత రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమాల టికెట్ రేట్లను చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో విధంగా ఉంటుంది. తెలంగాణలో పుష్ప-2 కంటే ముందు ఇష్టారీతిన రేట్లు పెంచుకునేవాళ్లు. సినిమా బడ్జెట్ ను బట్టి మల్టీ ప్లెక్సుల్లో టికెట్ రేటు మీద రూ.295 నుంచి రూ.350 వరకు పెంచుతున్నారు. సింగిల్ స్క్రీన్లలో 140 వరకు పెంచుకుంటున్నారు. అటు ఏపీలో మరీ అంత కాకపోయినా.. మల్టీ ప్లెక్సుల్లో రూ.180, సింగిల్ స్క్రీన్ టికెట్ ధర సినిమాను బట్టి రూ.112 నుంచి 150 మధ్య ఉంటోంది.
Read Also : Anushka vs Rashmika : అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా..?
Also Read
- Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్కి కూడా అదే కారణమా?
- Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
ఇలాంటి పద్ధతి మొన్నటి వరకు కర్ణాటకలో ఉండేది. కానీ తాజాగా కర్ణాటక ప్రభుత్వం అన్ని థియేటర్లలో ప్రతి సినిమాకు రూ.200లకు మించి టికెట్ రేట్ ఉండొద్దని జీవో జారీ చేసింది. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే పెరిగిన టికెట్ రేట్లు ఆడియెన్స్ ను థియేటర్లకు దూరం చేసేసింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే రూ.1000 వరకు పెట్టాల్సిందే. ఇంక థియేటర్ లో పాప్ కార్న్, తినే ఆహారాలు, కూల్ డ్రింక్ ల రేట్ల సంగతి అసలే చెప్పక్కర్లేదు. అందుకే ఈ రేట్లు పెరిగినప్పటి నుంచే ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా వరకు తగ్గిపోయింది. తెలంగాణ, ఏపీలో ఇదే పరిస్థితి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం త్వరలోనే ఏపీ, తెలంగాణలో కూడా వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ టికెట్ రేట్లపై పెద్ద హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా పదే పదే మాట్లాడుతున్నారు.
దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని నిర్మాతల మండలి కూడా చెబుతోంది. ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లను పెంచడం ఆపేశారు. కానీ మళ్లీ స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ కర్ణాటక తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో కూడా అలాంటి జీవో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో వస్తే ఆటోమేటిక్ గా ఏపీలోనూ అదే జరుగుతుంది. ఇది ఒక రకంగా సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేసే అవకాశం ఉంది. అది కూడా నిర్మాతలకు లాభమే. కానీ సినిమాలకు బడ్జెట్ ను తగ్గించుకుంటే లాభాలు ఊహించినదానికంటే ఎక్కువే ఉంటాయి.
Read Also : PV Sindhu: కొనసాగుతున్న పీవీ సింధు వైఫల్యం.. ఈ ఏడాదిలో అయిదో సారి!
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!