Sampath: అగ్నిసాక్షి సీరియల్ హీరో ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sampath: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు సంపత్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. సంపత్ జె రామ్ వయస్సు 35. చిన్నతనం నుంచి హీరో అవ్వాలని కలలు కని ఎన్నో కష్టాలు పడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. కన్నడలో అగ్నిసాక్షి అనే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అగ్నిసాక్షి సంపత్ అనే ఆయనను పిలిచేవారు. అయితే గత కొన్నిరోజులుగా తనకు అవకాశాలు రావడం లేదనే విషయంలో డిప్రెషన్ కు గురైనట్లు సమాచారం. ఆ డిప్రెషన్ లోనే సంపత్ బెంగుళూరులోని తన నివాసంలో శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Akhil Akkineni: ఆ హీరోయిన్ ను సెట్ లో వేధించిన అఖిల్.. నిజమేంటి ?
Also Read
- Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
- Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
- Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
- Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ఇక సంపత్ మృతి పట్ల ఆయన సహనటుడు రాజేష్ ధృవ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. ఆయనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. “నువ్వు ఇంకా చాలా సినిమాలు చేయాలి.. ఇంకా మంచి గుర్తింపును తెచ్చుకోవాలి. చాలా పోరాటం మిగిలి ఉంది. నీ కలల్ని సాకారం చేసుకోవాలి.. వెనక్కి తిరిగి రా” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల అసలు కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు. ఇక అతి చిన్న వయస్సులోనే ఆయన మృతి చెందడం పట్ల పలువురు బుల్లితెర నటులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
-
Tamil Nadu: గవర్నర్ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
-
Terror Threat to Delhi BJP HQ: ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.. రాజధానిలో హై అలర్ట్ ప్రకటించిన భద్రతా సంస్థలు!
-
Uttar Pradesh: బీజేపీ “మిషన్ యూపీ 2027” స్టార్ట్ .. యోగీ సర్కార్ కీలక చర్య..
-
Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు