Kangana Ranaut: హద్దు మీరితే, కాల్చి చంపేస్తా.. కంగనా స్ట్రాంగ్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut Warning Board Becomes Talk Of The Town: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈమధ్య తన సినిమాల కన్నా.. వివాదాస్పద చర్యల వల్లే వార్తల్లో నానుతోంది. పాలిటిక్స్ మీదనో, సినీ పరిశ్రమలోని అక్రమాల మీదనో.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వెల్లడిస్తుంది. అవతల ఎంత పెద్ద వ్యక్తులైనా సరే.. ఎలాంటి బిడియం లేకుండా నిలదీస్తుంది. వివాదాస్పద సందర్భాల్లోనూ.. తనదైన రీతిలో రియాక్ట్ అవుతూ, టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తుంది. అందుకే.. కథానాయికల్లో ఈ అమ్మడి రూట్ సెపరేట్ అని అందరూ అంటుంటారు. ఇందుకు సాక్ష్యంగా ఇప్పుడు మరో షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. అది చూసి.. ఎవ్వరైనా ఖంగుతినకుండా ఉండలేరు.
RC 15: మెగా పవర్ స్టార్ గుర్రం ఎక్కితే బాక్సాఫీస్ బద్దలవుతుంది…
Also Read
- Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
- Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. 'స్పిరిట్' షూటింగ్పై క్రేజీ అప్డేట్!
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
సాధారణంగా.. తమ ఇళ్లల్లో అనామకులు గానీ, దొంగలు గానీ చొరబడకుండా ఉండేందుకు కొందరు ఇంటి బయట ఒక వార్నింగ్ బోర్డు పెడతారు. ఆ బోర్డుపై ‘కుక్కలు ఉన్నారు జాగ్రత్త’ అనే హెచ్చరిక ఉంటుంది. కానీ.. కంగనా మాత్రం అందుకు భిన్నంగా ‘చంపేస్తా’ అంటూ వార్నింగ్ బోర్డు పెట్టింది. ముంబైలో ఉన్న తన ఇంటి ముందు ‘‘అనామకులకు ప్రవేశం లేదు, ఒకవేళ హద్దు మీరితే కాల్చి చంపేస్తా, అప్పటికీ ప్రాణాలతో బయటపడితే మళ్లీ కాల్చబడతారు’’ అనే హెచ్చరిక బోర్డుని పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు కంగనా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని కొనియాడుతుంటే, మరికొందరు ఈ తరహా బోర్డులు ఎలా పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Illegal Affair: అక్రమం సంబంధం మోజులో.. కట్టుకున్న భర్తను కాటికి పంపిన వైనం
కాగా.. గతంలో ముంబైలోని బాంద్రాలో కంగనా రనౌత్ ఆఫీస్ని కూలగట్టిన బృహణ్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. శివసేన, కంగనా మధ్య మాటల యుద్ధం జరిగినప్పుడు.. అది అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ఆఫీస్ని కూల్చారు. అంతకుముందే ఆమెకు నోటీసులు ఇవ్వగా.. దానిపై సమాధానం ఇవ్వకపోడంతో బీఎంసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బహుశా ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకునే.. కంగనా ఈ తరహా హెచ్చరిక బోర్డు పెట్టుకొని ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!