గత ఎన్నో ఏళ్లుగా కాన్స్ చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఐశ్వర్యా రాయ్. ఈ ఏడాది కూడా ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్తో కలిసి ఎంతో ఆత్మవిశ్వాసంతో కాన్స్ రెడ్ కార్పెట్పై సందడి చేశారు. అయితే, ఆమె ధరించిన అవుట్ఫిట్స్, అలాగే ఆమె వయసు (50 ఏళ్ల పైబడిన లుక్) ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ ట్రోలింగ్పై కంగనా రనౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.. తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఐశ్వర్యకు అండగా నిలుస్తూ
‘ఫ్యాషన్, స్టైల్ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఎవరికి నచ్చినట్లు వారు బట్టలు ఎంపిక చేసుకునే హక్కు వారికి ఉంటుంది. ఈ విషయంలో ఏ మహిళ కూడా ఎవరికీ ఎటువంటి వివరణ ఇవ్వక్కర్లేదు. కేన్స్లో ఐశ్వర్య అద్భుతంగా ఉన్నారు. ఐశ్వర్యను మరేదైనా స్టైల్లో చూడాలనుకుంటూ విమర్శలు చేసేవారు.. మొదట మీ దగ్గర ఏముందో, మీ ఫ్యాషన్ సెన్స్ ఏంటో ప్రపంచానికి చూపించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్యాషన్, స్టైల్ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో!’ అని కంగనా సవాల్ విసిరారు. అంతే కాదు ‘రెడ్ కార్పెట్పై ఎప్పుడూ కేవలం యువ నటీమణులే (Young Actresses) ఉండాలి అనుకోవడం తప్పు. అక్కడ 50 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా ఉంటారు. ఒకవేళ అంతర్జాతీయ వేదికలపై అలాంటి పెద్ద వయసు మహిళలను చూడడం మీకు అలవాటు లేకపోతే.. ఇకనైనా ఆ విషయాన్ని చూసి అలవాటు చేసుకోండి’ అని కంగనా తన పోస్ట్లో కుండబద్దలు కొట్టారు.
దీంతో నటీమణులు వయసు పైబడుతున్న కొద్దీ వారి లుక్స్, బాడీ షేమింగ్పై సమాజం చూపే వివక్షను కంగనా సరిగ్గా పాయింట్ అవుట్ చేసిందని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఐశ్వర్యా రాయ్ దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికపై భారత్ గర్వపడేలా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అలాంటి సెలబ్రిటీని గౌరవించాల్సింది పోయి వయసు పేరుతో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటూ కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
