బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది అనిపిస్తుందో మొహమాటం లేకుండా అదే ముఖం మీద చెప్పేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ అంతా ఒక వైపు ఉంటె కంగనా ఒక్కత్తే ఒక వైపు ఉంది. తన కు నచ్చనివారి గురించి ట్విట్టర్ ద్వారా ఏకిపారేయడం అమ్మడికి అలవాటే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై కంగనా చేసిన కామెంట్స్ ఇప్పటికీ మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కంగనా.. అమితాబ్ బచ్చన్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్.. ఇటీవల కంగనా నటించిన ‘ధాకడ్’ సినిమా నుంచి ‘షీ ఈజ్ ఆన్ ఫైర్’ అనే పాట టీజర్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్దీ నిమిషాల తరువాత ఆ ట్వీట్ ను తొలగించారు.
ఇక ఈ విషయమై కంగనా ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. “బాలీవుడ్ లో నాపై చాలామంది కక్ష కట్టారు. వారు నాపై అభద్రతా భావాన్ని ఏర్పరచుకొని నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. నేనంటే అమితాబ్ బచ్చన్ కూడా భయమేసిందేమో .. అందుకే ట్వీట్ వెంటనే డిలీట్ చేసేశారు.. లేక ఆయనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చి డిలీట్ చేయించారో తెలీదు” అంటూ వెటకారంగా మాట్లాడింది. ప్రస్తుతం కంగనా మాటలు నెట్టింట మరో దుమారాన్ని రేపాయి. బిగ్ బి అభిమానులు కంగనాను ఏకిపారేయడం మొదలుపెట్టారు. మరి వ్యాఖ్యలపై బిగ్ బి ఎలా స్పందిస్తారో చూడాలి.