Kalki 2898 AD: ఇద్దరు హీరోల ఆశలు అడియాశలే!!!
- మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు కల్కి 2898 ఏడి
- జూన్ 23వ తేదీన అమరావతిలో ఒక ఈవెంట్ ప్లాన్
- వర్షాభావ పరిస్థితులతో క్యాన్సిల్ చేసే యోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Event Cancelled at Amaravathi: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబచ్చన్, దిశాపటాని, దీపికా పదుకొనే వంటి స్టార్లు నటించడంతో పాటు టీజర్, ట్రైలర్ కట్స్ సినిమా మీద అంచనాలను పెంచాయి. నిజానికి ట్రైలర్ మీద మిశ్రమ స్పందన ఉన్నా ప్రస్తుతానికి ఆ సినిమా మీద బజ్ అయితే గట్టిగానే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ అమరావతిలో ప్లాన్ చేస్తున్నారని, జూన్ 23వ తేదీన జరగబోయే ఈ ఈవెంట్ కి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ప్రచారం జరిగింది. ఈ విధంగా అమరావతిలో జరిగే మొట్టమొదటి సినిమా ఈవెంట్గా కల్కి నిలిచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు చాలా కాలం తర్వాత పవన్, ప్రభాస్ కూడా ఒకే స్టేజి మీద కలిసి కనిపించబోతున్నారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల అభిమానులకు షాక్ కలిగించే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే అమరావతిలో ఈవెంట్ చేయడం లేదని తెలుస్తోంది.
Actor Darshan: ఒక మేనేజర్ మిస్సింగ్.. మరో మేనేజర్ ఆత్మహత్య.. మరిన్ని చిక్కుల్లో దర్శన్?
Also Read
- Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
- Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
- Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
- Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే చేస్తున్నారని, పార్క్ హయత్ లేదా ఐటీసీ కోహినూర్ హోటల్స్ లో ఈవెంట్ నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఈవెంట్ చేయకపోవడానికి కారణం వర్షాభావ పరిస్థితులనే చెబుతున్నారు. దానికి తోడు ప్రభాస్ కూడా అక్కడ వరకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి హైదరాబాద్లో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అయితే వారు వస్తారా రారా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. భారీ అంచనాలతో ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీ సేల్ విషయంలో కొన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినీ రికార్డులను బద్దలు కొడుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా ఆయన భార్య ప్రియాంక, మరదలు స్వప్న తమ తండ్రి అశ్వినీ దత్ తో కలిసి వైజయంతి బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?