Acharya : కాజల్ రోల్ కత్తిరించేశారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ట్రైలర్ లో ఎక్కడా కాజల్ కనిపించకపోవడం గమనార్హం. పూజాహెగ్డే కనీసం ఎక్కడో ఒక చోట తళుక్కున మెరిసింది. కానీ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న కాజల్ ఒక్క ఫ్రేములో కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. తాజాగా కాజల్ రోల్ లో సినిమాలో నుంచి పూర్తిగా కత్తిరించేశారని ప్రచారం జరుగుతోంది. తల్లి కాబోతున్న కాజల్ ఇటీవలి నెలల్లో అనేక ప్రాజెక్ట్ల నుండి తప్పుకుంది. ఇక సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉండే కాజల్ తాజాగా విడుదలైన “ఆచార్య” ట్రైలర్ ను తన పేజీలో కనీసం షేర్ చేయలేదు. దీంతో సినిమాలో నుంచి కాజల్ పోర్షన్ ను పూర్తి లేపేశారని, అసలు కాజల్ తన షూట్లో ఇంకా కొంత భాగాన్ని పూర్తి చేయనే లేదని అంటున్నారు. చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్లో మాత్రమే కాజల్ కనిపించనుందని టాక్ నడుస్తోంది. మరి కాజల్ ను జస్ట్ ట్రైలర్ లో చూపించలేదా ? లేదా సినిమాలోనే చూపించలేదా ? అనేది తెలియాల్సి ఉంది.
Read Also : South Cinema : బాలీవుడ్ ను ఆక్రమించేసిన సౌత్… నెల నుంచి మనదే హవా !
Also Read
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ఇప్పటికే ట్రైలర్ చెర్రీ డామినేషన్ ఎక్కువైందని కామెంట్స్ వస్తుండగా, మళ్ళీ కాజల్ రోల్ గురించి చర్చ నడవడం ఆసక్తికరంగా మారింది. కాగా “ఆచార్య” చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రీకొడుకులు చిరు, చరణ్ కలిసి కన్పించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. సోనూ సూద్, జిషు సేన్గుప్తా, వెన్నెల కిషోర్, సౌరవ్ లోకేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, అజయ్, సంగీత తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!