సినీ నటుడు సోనూసూద్ ఇల్లు, ఆయనకు సంబందించిన కంపెనీలపై ఐటీ శాఖ సర్వే చేసింది. ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్టు సమాచారం. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు.. సోనూసూద్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనాపై అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీజేపీకి~వ్యతిరేకంగా ఉన్నవే. ఇలాంటి సమయంలో సోనూ సూద్కు సంబంధించిన ఆరు నివాసాల్లో ఐటీ అధికారులు సర్వే చేశారనే వార్త సంచలనంగా మారింది.