Ilaiyaraaja: ‘మ్యూజిక్ స్కూల్’ కోసం బుడాపెస్ట్ లో సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. ఈ సినిమా నేపథ్య సంగీతానికీ బుడాపెస్ట్ లో తుది ముస్తాబులు చేశారు. అక్కడి ఆర్కెస్ట్రాతో రికార్డింగ్ ను ఇళయరాజా ఇటీవల పూర్తి చేశారు. మొత్తం 11 పాటలున్న ఈ సినిమాను పాపారావు బియ్యాల రాసి, దర్శకత్వం వహించారు. హైదరాబాద్ కు చెందిన యామినీ ఫిల్మ్స్ దీనిని నిర్మిస్తోంది. ఆస్కార్ అందుకున్న ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’లో మూడు పాటలు ఈ చిత్రం కోసం చేశారు. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ని మ్యాచ్ చేయడానికి ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని బుడాపెస్ట్ లో చేయాలనుకున్నామని ఇళయరాజా తెలిపారు.

Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
ఈ విషయం గురించి దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ, ”సింఫనీ ఆర్కెస్ట్రాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా భాగాలను ఇళయరాజా రాశారు. అందుకే మేం బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాని అప్రోచ్ అయ్యాం. ఇప్పుడున్న లీడింగ్ ఆర్కెస్ట్రాలో అది ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉంది. ఇళయరాజా గారు మా కోసం చాలా సమయం వెచ్చించారు. ఈ ప్రాజెక్ట్ మీద ఆయన పెట్టిన శ్రద్ధ చూసి చాలా ఆనందంగా అనిపించింది” అని అన్నారు. లండన్ ఫిలహార్మోనిక్ ఆర్కెస్ట్రాలో మూడు పాటలకు సంబంధించిన ఆర్కెస్ట్రైజేషన్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే పూర్తయ్యింది. ఆ పాటలు విన్న తర్వాత మిగిలిన పాటలకు సంబంధించిన పనులను బుడాపెస్ట్ సింఫనీలో చేస్తే అంతే గొప్ప క్వాలిటీ వస్తుందని సంగీత దర్శకుడు, దర్శకుడు భావించారు. బుడాపెస్ట్ లోని టామ్ టామ్ స్టూడియోలో ఈ రికార్డింగ్ జరిగింది. బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాను లస్జ్లో కోవాక్స్ కండక్ట్ చేశారు.
విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు పిల్లలపై పెడుతున్న ఒత్తిడి, నిర్విరామంగా సాగుతున్న చదువుకునే గంటలు వంటి వాటిని ప్రస్తావించే చిత్రమిది. కళలకు, ఇతర వ్యాపకాలకు అసలు టైమ్ లేకుండా చేసి ఇంజనీర్లు, డాక్టర్లుగా మార్చడానికి విద్యార్థులను ఎలా రుబ్బుతున్నారో చెప్పే చిత్రమిది. శ్రియా శరణ్, శర్మన్ జోషి, షాన్, ప్రకాష్ రాజ్, సుహాసిని మూలే, బెంజమిన్ గిలాని, గ్రేసీ గోస్వామి, ఓజు బరువా ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఏస్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన కిరణ్ డియోహాన్స్ కెమెరామేన్గా పనిచేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ, 18న ఇండస్ట్రీ / మార్కెటింగ్ సెక్షన్లోనూ ప్రదర్శించబోతున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!