హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని 1Ta******er, 1t****v, 5M****z వంటి వెబ్సైట్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:Young hero : హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు
కిరణ్ కుమార్ హైదరాబాద్లోని సినిమా థియేటర్లలో కామ్కార్డ్ ద్వారా సినిమాలను రికార్డు చేసి, HD ప్రింట్ రూపంలో పైరసీ మాఫియా గ్రూపులకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ లేదా బిట్కాయిన్ల రూపంలో చెల్లింపులు తీసుకునేవాడు. ఈ డబ్బులను జూ పే వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా భారతీయ కరెన్సీగా మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read:Nayanthara : పెళ్లి ఓ పొరపాటు.. నయనతార షాకింగ్ పోస్ట్
ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ చేంజర్, రాజధాని వంటి సినిమాల ఫైల్స్ను కిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 65 సినిమాలను ఇప్పటివరకు రికార్డు చేసినట్లు నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. సినిమా థియేటర్లలోనే రికార్డింగ్ చేసి, వాటిని పైరసీ మాఫియాకు అమ్మడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించాడు. ఈ అరెస్టుతో పైరసీ నెట్వర్క్పై మరింత లోతైన విచారణ జరుగుతోంది. సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించే ఈ రాకెట్ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
