సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోన్న మూవీ ‘హైకూ’ షూటింగ్ పార్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ‘కోర్ట్’ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఆమెతో పాటు ఏగన్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజన్ సినిమా హౌస్ బ్యానర్పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మొత్తం 4 షెడ్యూళ్లలో, 90 రోజుల పాటు రేయింబగళ్లు శ్రమించి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కంటెంట్ విషయంలో చాలా సెలెక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ చూశాకే బిజినెస్ మాట్లాడుతున్నారు. కానీ ‘హైకూ’ సినిమా విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. “ఈ సినిమా కథా బలం, అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్ను నమ్మి.. షూటింగ్ పూర్తి కాకముందే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారీ ధరతో పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మేకింగ్ స్టేజ్ లోనే ఇలాంటి క్రేజీ డీల్ సెట్ అవ్వడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.”
సినిమా ఔట్పుట్ పట్ల దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేయడం ఎంటైర్ టీమ్కు చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ మూమెంట్. కథను నమ్మి నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన మా నిర్మాతలకు స్పెషల్ థాంక్స్. శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ లతో పాటు నటీనటులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్తో ‘హైకూ’ను హృదయానికి హత్తుకునే ఒక ఎమోషనల్ డ్రామాలా, మంచి థియేట్రికల్ ఫీల్ ఇచ్చేలా అద్భుతంగా రూపొందించాం’’ అని చెప్పారు.

