Guntur Kaaram: ‘గుంటూరు కారం’ నమ్మేదేలే… రంగంలోకి మరో బ్యూటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరె బాబు… గుంటూరు కారం పై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అని మేకర్స్ ఎంత చెప్పినా నమ్మేదేలే అనే రేంజ్లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పుకార్లు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ నుంచి తమన్ ఔట్ అయ్యాడనే ప్రచారం జరిగింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కూడా సైడ్ అయిపోయిందని జోరుగా వినిపిస్తోంది. కానీ… ఇలాంటి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. అంతేకాదు ఈ నెల 24 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అయినా కూడా గుంటూరు కారం పై రూమర్స్ ఆగడం లేదు. తాజాగా ఈ సినిమా కోసం మరో యంగ్ బ్యూటీని రంగంలోకి దింపారనే న్యూస్ వైరల్ అవుతోంది. ముందుగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డేను అనుకున్నారు. కొంత షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత సెకండ్ లీడ్ కోసం శ్రీలీలను తీసుకున్నారు కానీ ఇప్పుడు పూజా హెగ్డేను తీసేసి మరో హీరోయిన్ను తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.
తెలుగులో త్రివిక్రమ్ బ్యాకప్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ను పూజా ప్లేస్లోకి రిప్లేస్ చేసినట్టు తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ సినిమాతో సంయుక్త మీనన్ను తెలుగు ఆడియెన్స్కు పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఆ తర్వాత ‘సార్’లో ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇటీవల వచ్చిన విరూపాక్ష మూవీతో గోల్డెన్ లెగ్గా మారిపోయింది సంయుక్త. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’లో పూజా హెగ్డే బదులుగా.. సంయుక్తను సెలెక్ట్ చేశారని సమాచారం. ఇదే నిజమైతే… ‘గుంటూరు కారం’లో శ్రీలీల ఫస్ట్ హీరోయిన్గా ప్రమోట్ అవనుంది. అయితే ఇలాంటి వార్తల్లో అసలు నిజముందా? అంటే లేదనే చెప్పాలి కానీ సినిమా అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పైగా గుంటూరు కారం పై వస్తున్న పుకార్లు అన్నీ ఇన్ని కావు. అందుకే.. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే మేకర్స్ మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిందే.
Also Read
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!