Guntur Kaaram: డీఓపీ తొలగింపు.. అసలు నిజం చెప్పిన కొత్త డీఓపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక గొడవ బయటకు వస్తూనే ఉంది. మొదట ఈ సినిమా నుంచి పూజా హెగ్డే బయటకు వచ్చేసింది. అయితే పూజా బయటకు రావడానికి కారణం వేరే వేరే కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే అలాంటిదేమి లేదని, పూజాకు డేట్స్ అడ్జెస్ట్ కాలేక సినిమానుంచి వైదొలగిందని, ఆమె తమ ఇంటి పిల్ల అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలపడంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇకపూజా తరువాత ఈ సినిమా నుంచి డీఓపీ పీఎస్ వినోద్ బయటికి వచ్చేశాడు. ఇక ఆయన ప్లేస్ లో డీఓపీ మనోజ్ పరమహంస వచ్చి చేరాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ఆసక్తికరమైన వవిషయాలను పంచుకున్నాడు.
Director Ubaini: సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చారని ఆ పని చేసిన డైరెక్టర్..
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
“నాకు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. మహేష్ బాబు అంటే అందరికీ నచ్చిన ఒక కుటుంబంలోని మనిషి. మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. మహేష్ తో ఎందుకు సినిమా చెయ్యట్లేదు అని.. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మహేష్ గారికి సినిమాటోగ్రఫీ లో తెలియని విషయం లేదు. ఆయనతో సినిమా అంటే ఒక ఛాలెంజ్ లా ఉంటుంది. ఎందుకంటే చిన్న తప్పు చేసినా ఆయన కనిపెట్టేస్తారు. వేరే హీరోల్లా కాకుండా ఆయన అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. ఆయన అన్నీ డిటైల్డ్ గా చూడడం నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఆయన ఒక విషయం చెప్పారు అంటే పర్ఫెక్ట్ గా, కథకి సూట్ అయ్యేలా ఉంటది. ఆ పాయింట్స్ తీస్కొని విడమర్చి చెప్పినట్లు చేస్తే అవుట్ ఫుట్ బాగా వస్తుంది. పీఎస్ ఆనంద్ గారికి వేరే కమిట్మెంట్స్ వల్ల వెళ్లాల్సి వస్తే థమన్ నాకు ఫోన్ చేసి పిలిచారు, గుంటూరు కారం చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్, నేను చేయాలి అని చెప్పారు. నాకు వేరే కమిట్మెంట్ ఉంటే, వంశీ గారు మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేశారు” అని చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?