Guntur Kaaram: డీఓపీ తొలగింపు.. అసలు నిజం చెప్పిన కొత్త డీఓపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక గొడవ బయటకు వస్తూనే ఉంది. మొదట ఈ సినిమా నుంచి పూజా హెగ్డే బయటకు వచ్చేసింది. అయితే పూజా బయటకు రావడానికి కారణం వేరే వేరే కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే అలాంటిదేమి లేదని, పూజాకు డేట్స్ అడ్జెస్ట్ కాలేక సినిమానుంచి వైదొలగిందని, ఆమె తమ ఇంటి పిల్ల అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలపడంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇకపూజా తరువాత ఈ సినిమా నుంచి డీఓపీ పీఎస్ వినోద్ బయటికి వచ్చేశాడు. ఇక ఆయన ప్లేస్ లో డీఓపీ మనోజ్ పరమహంస వచ్చి చేరాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమాపై ఆసక్తికరమైన వవిషయాలను పంచుకున్నాడు.
Director Ubaini: సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చారని ఆ పని చేసిన డైరెక్టర్..
Also Read
“నాకు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. మహేష్ బాబు అంటే అందరికీ నచ్చిన ఒక కుటుంబంలోని మనిషి. మా ఫ్రెండ్స్ ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. మహేష్ తో ఎందుకు సినిమా చెయ్యట్లేదు అని.. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మహేష్ గారికి సినిమాటోగ్రఫీ లో తెలియని విషయం లేదు. ఆయనతో సినిమా అంటే ఒక ఛాలెంజ్ లా ఉంటుంది. ఎందుకంటే చిన్న తప్పు చేసినా ఆయన కనిపెట్టేస్తారు. వేరే హీరోల్లా కాకుండా ఆయన అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. ఆయన అన్నీ డిటైల్డ్ గా చూడడం నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఆయన ఒక విషయం చెప్పారు అంటే పర్ఫెక్ట్ గా, కథకి సూట్ అయ్యేలా ఉంటది. ఆ పాయింట్స్ తీస్కొని విడమర్చి చెప్పినట్లు చేస్తే అవుట్ ఫుట్ బాగా వస్తుంది. పీఎస్ ఆనంద్ గారికి వేరే కమిట్మెంట్స్ వల్ల వెళ్లాల్సి వస్తే థమన్ నాకు ఫోన్ చేసి పిలిచారు, గుంటూరు కారం చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్, నేను చేయాలి అని చెప్పారు. నాకు వేరే కమిట్మెంట్ ఉంటే, వంశీ గారు మాట్లాడి డేట్స్ అడ్జస్ట్ చేశారు” అని చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!