నిర్మాతగా ఇంద్రాణి, సునామీ వంటి సినిమాలను చిత్రాలను నిర్మించి సినిమాలకు సంబంధించిన పలు శాఖలలో పనిచేసిన గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి) ని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, విజయ్ వర్మ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అధ్యక్ష, కార్యదర్సులు అందజేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సినిమా టెలివిజన్ కి సంబంధించిన 24 సబ్ కమిటీల సమన్వయ చైర్మన్ గా ఆయా విభాగాల సమస్యల పరిష్కారానికి , సంక్షేమానికి మధుకర్ కృషి చేస్తారని అన్నారు. ఇక మధుకర్ మాట్లాడుతూ :- అంతర్ రాష్ట్ర సినీ టెలివిజన్ రంగాల విస్తృత అవకాశాలకై కృషి చేస్తానని అన్నారు. ఇక ఇప్పటికే 10 రాష్ట్రాలలో శాఖలు ఏర్పాటు చేసిన తాము ఈశాన్య రాష్ట్రాల కమిటీలను అతి త్వరలో ఏర్పాటు చేయనున్నామని , తత్ఫలితంగా నట సాంకేతిక అవకాశాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు మెరుగవుతాయని ప్రధాన కార్యదర్శి వీఎస్ విజయ్ వర్మ పాకలపాటి పేర్కొన్నారు.