NTV Telugu Site icon

Gopichand Malineni: శృతి హాసన్ తో ఎఫైర్.. గోపీచంద్ ఏమన్నాడంటే..?

Gopichand

Gopichand

Gopichand Malineni: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎన్ని ప్రశంసలు ఉంటాయో అన్నే విమర్శలు ఉంటాయి. విమర్శలను తట్టుకోలేని వారు ప్రశంసలు అందుకోనేవరకు వెళ్లరు ఇక ఒక హీరో హీరోయిన్ కానీ. ఒక డైరెక్టర్, హీరోయిన్ కానీ వరుసగా మూడు నాలుగు సినిమాలు చేయడం ఆలస్యం.. వారిమధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టించేస్తారు. దానివలన హీరోయిన్లు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఇండస్ట్రీ టాక్. ఇక తాజాగా ఒక డైరెక్టర్ కు, హీరోయిన్ కు మధ్య ఎఫైర్ ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ హీరోయిన్, డైరెక్టర్ ఎవరో కాదు.. వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. బాలయ్యతో నటించిన శృతి హాసన్. శృతి, గోపీచంద్ కాంబో లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి. గోపీచంద్ మీద ఉన్న అభిమానంతోనే శృతి, వీరసింహారెడ్డి లో బాలయ్య సరసన నటించడానికి ఒప్పుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో గోపీచంద్, శృతికి ఐ లవ్ యూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆయన మాట్లాడిన వెంటనే శృతి, గోపీచంద్ ను అన్నయ్య అని పిలవడంతో మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. ఇక ఈ ఈవెంట్ తర్వాత వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు మొదలయ్యాయి.

Ram Chran: తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పిన చరణ్

ఇక తాజాగా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “శృతితో నేను మూడు సినిమాలు చేశాను. చాలా మంచి అమ్మాయి. ఆమెతో కలిసి మూడు సినిమాలు పనిచేయడం వలన నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయింది. తన యాక్టింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం.. మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉంది. శృతి మా ఇంటికి కూడా వస్తుంది.. నా వైఫ్ కు కూడా ఆమె అంటే ఎంతో ఇష్టం. ఇక నా కొడుకు కూడా శృతిని ఇష్టపడతాడు. ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా వాడికి చాక్లెట్స్ తెస్తూ ఉంటుంది. మా మధ్య ఆ బంధం ఉండబట్టే స్టేజిపై నన్ను అన్నయ్య అని పిలిచింది. ఒక అమ్మాయి- అబ్బాయి లవ్ యూ అని చెప్పుకున్నంత వారిమధ్య ఏదో ఉందని ఊహించేసుకొని వచ్చిన ట్రోల్స్ చూసి నేను నవ్వుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.