Rebel Star Krishnam Raju’s birth anniversary celebrations on 20th of this month: రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. శ్యామలాదేవితో కలిసి కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణం రాజు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ వైద్య శిబిరంలో జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ నుంచి డా.వర్మ పాల్గొంటారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డయాబెటిస్ తో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని శ్యామలాదేవి తెలిపారు.
Smartphone: స్మార్ట్ఫోన్ను కొనేప్పుడు ఈ 3 విషయాలు చెక్ చేయండి.. లేకుంటే మీరే బాధ పడతారు!
మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ – కృష్ణంరాజు జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చేస్తున్నాం, ఈ సందర్భంగా శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, బాబు ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు వెయ్యి మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నాం అని చెప్పారు.