Essence Of Thandel: ఎసెన్స్ అఫ్ ‘తండేల్’.. ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Essence Of Thandel Released: ‘తండేల్’ సినిమా యూనిట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రాసెస్ ని ఆస్వాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి, తాజాగా‘తండేల్’ సారాంశాన్ని ఆవిష్కరించి ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటూ ఒక విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో ఉన్న యువ సామ్రాట్ నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్…ఇక రాజులమ్మ జాతరే’ అని చైతు చెప్పిన మ్యాసీ డైలాగ్ అభిమానులను అలరించేలా ఉంది. అనుకోకుండా, చైతూ అండ్ టీమ్ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు, వారిని కరాచీలోని సెంట్రల్ జైలులో బంధిస్తారు, అక్కడ వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. జైలర్ జాతీయవాదాన్ని ప్రశ్నించినప్పుడు, కథానాయకుడు “మా నుంచి ఊడిపోన ఒక ముక్క… మీకే అంతుంటే.. ఆ ముక్కని ముష్టేసిన మాకెంతుటుంది… భారత్ మాతా కీ జై…” అని జైలర్ కి తగిన సమాధానం ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక రాజు ప్రేమికురాలిగా సాయి పల్లవి పోషించిన బుజ్జి తల్లి పాత్రని పరిచయం చేయడంతో గ్లింప్స్ ఆహ్లాదకరంగా ముగుస్తుంది. 126-సెకన్ల క్లిప్ రాజు ప్రపంచం, అతని రెండు విభిన్న పార్శ్వాలను చూపించేలా ఉంది.
Kanakamedala: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ఇది పాకిస్తాన్ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ మత్స్యకారుని నిజజీవిత కథ. అతని ప్రేమకథను కూడా చాలా అందంగా ప్రజెంట్ చేయనున్నారు. ఈ గ్లిమ్ప్స్ లో నాగ చైతన్య మునుపెన్నడూ చూడని రస్టిక్ అవతార్లో కనిపించాడు. శ్రీకాకుళం యాసని అద్భుతంగా పలుకుతూ కనిపిస్తున్నారు. ఇక చైతు ప్రీ-ప్రొడక్షన్కి క్వాలిటీ టైం వెచ్చించి అక్కడి మాండలికం,బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుని నిలబడ్డాడు. ఇక సాయి పల్లవి అందంగా కనిపించింది. ఇద్దరూ కలిసి కనిపించనప్పటికీ, చైతు మాటలు, సాయి పల్లవి ఎక్స్ ప్రెషన్స్ ద్వారా సినిమాలో వీరిద్దరూ ఎలాంటి కెమిస్ట్రీని పంచుకున్నారు అనెడి గ్రహించవచ్చు. సన్నివేశాలు పెయింటింగ్ లాగా రూపొందించబడ్డాయి. ఇది ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ను అందిస్తోంది. దర్శకుడు చందూ మొండేటి గ్లింప్స్ ద్వారా కోర్ పాయింట్ని వెల్లడించి, చాలా లేయర్లు ఉన్న సబ్జెక్ట్ని డీల్ చేయడంలో తన నైపుణ్యాన్ని చూపించాడని చెప్పచ్చు. చివరి పోర్షన్లలో ప్రేమకథను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణంతో పాటు సాంకేతిక ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆకట్టుకునే నేపధ్య సంగీతం, ముఖ్యంగా ప్రేమకథకు మరింత ఆకర్షణని తీసుకొచ్చిందని అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!