Esha Deol: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమామాలిని కూతురు, నటి ఈషా డియోల్ అభిమానులకు చేదువార్త చెప్పింది. తన భర్త భరత్ తక్తానీతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆమె ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసింది. తామిద్దరం 12 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నామని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని తెలిపింది. దీంతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఈషా డియోల్.. బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర- హేమామాలిని పెద్ద కూతురు. తల్లి అడుగుజాడల్లోనే ఈ చిన్నది 21 ఏళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అన్ని భాషల్లో 30 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో సూర్య సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు, తమిళ్ అభిమానులు పెరిగిపోయారు అని చెప్పొచ్చు. అనంతరం 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టాకా వారిని పెంచడంతో ఆ సమయం గడిచిపోయింది. ఇక డిజిటల్ ఓటిటీ లు రావడంతో ఈషా కూడా ఓటిటీలో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇక గత కొన్నేళ్లుగా భరత్ – ఈషా మధ్య పడడం లేదని, ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదర్చాలని చూసినా కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోయినట్లు తెలుస్తోంది.