Mohan Raja: స్టోరీలో మెగాస్టార్ వేలు పెడతారని అన్నవాళ్లను కొట్టేస్తా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Raja: హైదరాబాద్ నోవాటెల్లో శనివారం రాత్రి గాడ్ ఫాదర్ మూవీ సక్సెట్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇండియన్ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కీలకంగా మారారని.. మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తామని తెలుగు ఆడియన్స్ మరోసారి చాటిచెప్పారని మోహన్ రాజా కొనియాడాడు. తాను పుట్టింది, పెరిగింది తమిళనాడులో అయినా దర్శకుడిగా పుట్టింది మాత్రం ఆంధ్రాలోనే అని గర్వంగా చెప్పాడు.
తన తొలి సినిమాను తన తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మించారని దర్శకుడు మోహన్ రాజా వెల్లడించాడు. తన తండ్రి తెలుగులో హిట్లర్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించినా తమ కోసం తమిళనాడుకు వచ్చి 20 ఏళ్లు ఉన్నారని గుర్తుచేసుకున్నాడు. గాడ్ ఫాదర్ సినిమా తీసే సమయంలో ప్రతిరోజూ తన తండ్రి ఫోన్ చేసి బాగోగులు అడిగేవారని మోహన్ రాజా ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా టైంలో తనను ముగ్గురు బాగా చూసుకున్నారని.. వారిలో ఒకరు మెగాస్టార్, రెండో వారు నిర్మాత ఎన్వీ ప్రసాద్.. మూడో వ్యక్తి సత్యానంద్ అని తెలిపారు. కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాత ఎన్వీ ప్రసాద్ రూ.కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ ఆ ఈవెంట్ రోజు వర్షం పడటంతో పలువురు బ్యాడ్ లక్ అని చెప్పే పరిస్థితి నెలకొందన్నారు. అయితే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంతో ఈ సినిమాకు ఊపు తెచ్చారని తెలిపారు.
Also Read
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
Read Also: Nuvve Nuvve: ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ వంతు..!!
అటు స్టోరీలో మెగాస్టార్ వేలు పెడతారని అన్నవాళ్లను కొట్టేస్తానని మోహన్ రాజా వార్నింగ్ ఇచ్చాడు. ఆయన లాంటి ఎక్స్పీరియన్స్ను వాడుకోకపోతే తాము ఫూల్స్ అని అన్నారు. ప్రతి సీన్ కోసం చిరంజీవి ఇన్పుట్ ఇస్తారని.. ఆయన లాంటి సీనియర్ నటుడు ఉన్నప్పుడు ఆయన చెప్పే సలహాలు తీసుకోవడం తమ లాంటి వ్యక్తుల బాధ్యత అని అభిప్రాయపడ్డారు. మెగాస్టార్ వంటి నటులను శాటిస్ఫై చేయాలని.. అలా చేశాం కాబట్టే గాడ్ ఫాదర్ మూవీ ఈరోజు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని మోహన్ రాజా మాట్లాడాడు. గతంలో తన తండ్రి సినిమా విడుదలైతే తమకు థియేటర్లు ఇవ్వరా అని ఎగ్జిబిటర్లు అడిగేవారు అని.. అలాంటి స్థితిలో తెలుగులో సినిమాలను నిర్మించకుండా వదిలేసిన తమ తండ్రి ఎడిటర్ మోహన్ ఎంతో గొప్పవారు అని కొనియాడాడు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!