Geetha Krishna : కీరవాణి పేరు ఈ నడుమ వివాదాల్లో వినిపిస్తోంది. మొన్ననే సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసింది. కీరవాణి తమను వెట్టి చాకిరీ చేయమన్నాడు అంటూ సంచలనం రేపింది. అయితే కొందరు ప్రవస్తిని తప్పుబడుతున్నారు. ఇంకొందరేమో ప్రవస్తికి సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ కీరవాణిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆయనే డైరెక్టర్ గీతాకృష్ణ. ‘కీరవాణి నాకు 40 ఏళ్ల నుంచి తెలుసు. చాలా సార్లు పార్టీల్లో కలిస్తూనే ఉంటాం. అతని గురించి చాలా మంది నా దగ్గరకు వచ్చి చెబుతుంటారు. కానీ అతని క్యారెక్టర్ ను బయట పెట్టాల్సిన అవసరం నాకేముంది అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఓ అమ్మాయి గళం విప్పింది. అందుకే నేను మాట్లాడుతున్నాను.
Read Also : Mahesh Babu : ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ.. ఏమన్నాడంటే..?
కీరవాణికి అమ్మాయిలను సప్లై చేసే వారిని స్కూల్ పిల్లలు కావాలని అంటాడంట. స్కూల్ పిల్లలను తీసుకు రావాలంటూ కీరవాణి ఫోర్స్ చేస్తాడంట. ముందు వాడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలి. కీరవాణికి ఇలాంటివి అలవాటే. అతనికి అహంకారం చాలా ఎక్కువ. సింగర్స్ ను చాలా చిన్నచూపు చూస్తాడు. రాజమౌళిపై ఇలాంటి ఆరోపణలు లేవు. కానీ కీరవాణిపై మాత్రం చాలానే ఉన్నాయి. వాడిని ఒకప్పుడు ఆఫీసులో నుంచి గెంటేస్తే.. నేనే ఖర్చులకు డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వెడ్డింగ్ రిసెప్షన్ లో పాటలు పాడేవారంటే తనకు చిరాకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలి’ అంటూ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి.