NTR: ఎన్టీఆర్ ఆ బొకేను.. అందుకే విసిరి కొట్టాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోపం రావడం చాలాతక్కువ సార్లు చూసి ఉంటాం. మొదటి నుంచి కూడా తారక్ కు చాలా కోపం ఎక్కువ అంట. పెళ్లి తరువాత.. పిల్లలు పుట్టాకా ఆ కోపం తగ్గిందని ఆయనే స్వయంగా ఓకే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సహజంగా తానెప్పుడు బయట కోపం తెచ్చుకొను అని చెప్తూ ఉంటాడు. ఫ్యాన్స్ ఎంత గోల చేసినా.. ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. చివరికి తాత పేరును యూనివర్సిటీకి తీసివేసినా ఎన్టీఆర్ ఏరోజు కోపం తెచ్చుకోలేదు. కనీసం సీరియస్ గా ఒక్క మాట అన్నది కూడా లేదు. అయితే.. మొట్టమొదటిసారి నిన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కోపాన్ని చూశాం అంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మే 28.. ఎన్టీఆర్ శతజయంతి జరుగుతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్.. తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించడానికి విచ్చేశాడు. ఈ ఒక్కసారే అని కాదు ప్రతి ఏడాది.. అదే రోజున అభిమానులు తారక్ ను చూడడానికి తండోపతండాలుగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుంటారు.
Allu Sirish: బన్నీ బ్రదర్.. మరో రీమేక్.. ?
Also Read
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
ఇక ఈ నేపథ్యంలోనే తారక్ డైరెక్ట్ గా వెళ్లి నివాళులు అర్పించడానికి రాగా.. పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆయనకు బొకే ఇవ్వడానికి ప్రయత్నించాడు. దాన్ని తారక్ నెట్టేసి పక్కనే ప్లేట్ లో ఉన్న గులాబీ పూలతో తాతకు నివాళులు అర్పించి వెళ్ళిపోయాడు. ఇక అది జరిగింది. దీంతో ఆ బొకేను పక్కకు నెట్టడంతో తారక్ కు కోపమొచ్చిందా..? ఎందుకు ఆయన బొకేను తీసుకోలేదు.. ఎందుకు విసిరికొట్టాడు..? అంటూ సోషల్ మీడియాలో చర్చా గోష్ఠి మొదలయ్యింది. ఇక దీన్ని కొందరు రాజకీయం చేస్తుండగా.. మరికొందరు తారక్ ను ట్రోల్ చేసేవారందరిని ఇలా విసిరికొట్టడమే అని మీమ్స్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది..? అంటే.. అంతమంది జనం మధ్య వచ్చిన తారక్ కు.. అక్కడ ఇద్దరు వ్యక్తులు రెండు చేతుల్లో బొకేలు పట్టుకొని ఆయనకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. నాది తీసుకోండి.. నాది తీసుకోండి అన్నట్లు ఒకరిమీదఒకరు పడి తోసుకుంటూ రావడానికి ట్రై చేస్తుంటే.. తారక్.. ఇద్దరిది తీసుకోకుండా అక్కడే ఉన్న పూలతో నివాళులు అర్పించి వెళ్ళిపోయాడు. అది కోపం కాదు.. కేవలం.. అభిమానులను ఇబ్బంది పెట్టకుండా.. నొచ్చుకోకుండా చేయడం కోసం మాత్రమే అని అక్కడ ఉన్నవారు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ కి కోపం వచ్చిందా..! #NTR #FANS #NtvENT pic.twitter.com/paGTckmSJ1
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) May 28, 2023
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?