Dhurandhar: ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ నటించిన ‘‘ధురంధర్’’ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే బాక్సీఫీస్ వద్ద రికార్డుల్ని కొల్లగొట్టిన ఈ మూవీ, నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా ప్రేక్షకుడు విరగబడి చూస్తున్నారు. పాకిస్తాన్ బ్యాక్డ్రాప్గా ఐఎస్ఐ, ఉగ్రవాదులు, మాఫియా, రాజకీయం ఎలా ముడిపడి ఉంటుందనే విషయాలను సినిమాలో చూపించారు. దీంతో పాకిస్తాన్తో పాటు మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాలు ఈ సినిమాపై నిషేధాన్ని విధించాయి.
Read Also: Dhanush D55 Film: D55 క్రేజీ అప్డేట్.. ధనుష్ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు
ఇదిలా ఉంటే, ధురంధర్ను పాక్ బ్యాన్ చేసినప్పటికీ అక్కడి పాక్ ప్రజలు మాత్రం ఎలాగోలా ఈ సినిమాను చూస్తున్నారు. ఇప్పటికే పైరసీ ఫ్రింట్లను రికార్డ్ స్థాయిలో డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ధురంధర్ నెట్ఫ్లిక్ పాకిస్తాన్లో నెంబర్ వన్గా ట్రెండింగ్లో కొనసాగుతోంది. ఓటీటీలోకి జనవరి 30న వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ పై బ్యాన్ ఉన్నా కూడా పాక్ ఆడియెన్స్ మాత్రం ధురంధర్ సినిమాను తెగ చూసేస్తున్నారు.
ధురంధర్ రూ. 1000 కోట్లు సాధించిన సినిమాల క్లబ్లో చేరింది. ఈ రికార్డును ఇంతకు ముందు బాహుబలి 2: ది కన్క్లూజన్ (రూ. 1,417 కోట్లు), KGF: చాప్టర్ 2 (రూ. 1,001 కోట్లు), పుష్ప 2: ది రూల్ (రూ. 1,471.1 కోట్లు) పేరిటి ఉన్నాయి. విషయం ఏంటంటే, కేవలం హిందీలోనే రిలీజైన ధురంధర్ రూ. 1000 కోట్లను కొల్లగొట్టడం మరో రికార్డ్. ధురంధర్-2 మార్చి 19, 2026లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.