Dhanush D55 Film: అమరన్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు రాజకుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ధనుష్ హీరోగా D55 అనే ఒక ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసా.. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి జత కడుతోంది. గతంలో ఆమె అమరన్ సినిమాలో చేసిన పాత్రకు సినీ ప్రేమికుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోయిన్ల రాకతో సినిమాకు అదనపు ఆకర్షణ వచ్చినట్లు అయ్యిందని ధనుష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
వందర్బార్ ఫిల్మ్స్ బ్యానర్లో ధనుష్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తు్న్నారు. అమరన్ సినిమాలో ఆయన స్వరపరిచిన స్వరాలు ప్రేక్షకులను ఎంతలా మంత్రముగ్ధులను చేశాయో తెలిసిందే. ఇప్పుడు D55లో ఆయన ఏ రేంజ్లో ఆడియన్స్ను తన స్వరాలతో మాయ చేస్తారో చూడాలి. అమరన్ సినిమా తర్వాత దర్శకుడు రాజకుమార్ పెరియసామి డైరెక్షన్లో వస్తున్న చిత్రం కావడం, ఇందులో హీరోగా ధనుష్ నటిస్తూ, స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం, హీరోయిన్లుగా సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
READ ALSO: UAE President: కొడుకు చేతికి $260 బిలియన్ల ఆస్తులు.. వారసుడికి బాటలు వేస్తున్న UAE ప్రెసిడెంట్!