యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో భారీ యుద్ధానికి సిద్ధమయ్యాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. దేవరగా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఎన్టీఆర్ గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ వచ్చేసాడు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన దీపావళి పార్టీలో ఫ్యామిలీతో సహా పాల్గొన్న ఎన్టీఆర్… ఇక మళ్లీ మేకప్ వేసుకోడానికి రెడీ అయ్యాడు. ఫెస్టివల్ బ్రేక్ కి ఎండ్ కార్డ్ వేసి దేవర సెట్స్ లో పాల్గొంటున్నాడు. ఈ విషయమై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ “ఎపిక్ షెడ్యూల్” జరుగుతుందని ట్వీట్ చేసారు.
Read Also: Salaar Movie : ‘సలార్’ ప్రమోషన్స్ కోసం రంగంలోకి RCB..ప్రశాంత్ నీల్ ప్లాన్ మాములుగా లేదుగా..
కొరటాల శివ ఫుల్ స్వింగ్ అండ్ స్పీడ్ లో దేవర షూటింగ్ చేస్తున్నాడు. పార్ట్ 1ని ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేయడమే టార్గెట్ గా దేవర షూటింగ్ జరుగుతోంది. అందుకే ఎక్కువ గ్యాప్స్ లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నాడు కొరటాల శివ. నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మిడ్ కి దేవర సినిమాలో ఎన్టీఆర్ పార్ట్ కాంప్లీట్ చేయడానికి టీమ్ అంతా కష్టపడుతున్నారు. అక్కడి నుంచి 2024 ఏప్రిల్ వరకూ రిలీజ్ కి గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకోని రావడానికి కొరటాల శివకి కూడా కావాల్సినంత సమయం దొరుకుతుంది.
Read Also: Keerthy Suresh: మహానటి ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం…
After a brief festival break, our hardworking team is back on sets for another epic schedule.#Devara Part 1 – A big screen extravaganza unveiling on April 5th 2024.
— Devara (@DevaraMovie) November 14, 2023