The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kashmir Files కాశ్మీరీ పండిట్లపై 1990లో జరిగిన అఘాయిత్యాల అంశం ఆధారంగా తెరకెక్కి, మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన BJP పార్లమెంటరీ సమావేశంలో ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే, సినిమా చూడాలని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, నేతలకు సూచించారు. ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. ‘సత్యాన్ని దేశం ముందుకు తీసుకురావడం దేశ శ్రేయస్సు కోసమే. గత కొన్ని దశాబ్దాలుగా మరుగున పడిన నిజాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. నిజాన్ని దాచిన వారే వ్యతిరేకిస్తున్నారు. భిన్నమైన దృక్కోణం ఉన్నవారు మరో కోణంలో కూడా సినిమా తీయవచ్చు” అంటూ చెప్పుకొచ్చారు.
Read Also : The Ghost : ఎడారిలో యాక్షన్.. నాగార్జున స్టంట్స్ స్టార్ట్
Also Read
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
- JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాస్తవాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మెచ్చుకునే బదులు, కాశ్మీర్ ఫైల్స్ను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది పూనుకున్నారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1975 ఎమర్జెన్సీ లేదా విభజన వంటి అనేక అంశాలపై ప్రామాణికమైన సినిమాలు తీయాలని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రం మతపరమైన ఎజెండాను కలిగి ఉందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు కొన్ని వర్గాలు నుంచి ఎదుర్కొంటున్న విమర్శల మధ్య ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాదు కర్ణాటక శాసనసభ్యుల కోసం సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ కగేరి సోమవారం అన్నారు.రోజురోజుకూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా సపోర్ట్ పెరిగిపోతోంది.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!