The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kashmir Files కాశ్మీరీ పండిట్లపై 1990లో జరిగిన అఘాయిత్యాల అంశం ఆధారంగా తెరకెక్కి, మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో జరిగిన BJP పార్లమెంటరీ సమావేశంలో ఈ సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే, సినిమా చూడాలని సమావేశంలో పాల్గొన్న ఎంపీలు, నేతలకు సూచించారు. ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని అన్నారు. ‘సత్యాన్ని దేశం ముందుకు తీసుకురావడం దేశ శ్రేయస్సు కోసమే. గత కొన్ని దశాబ్దాలుగా మరుగున పడిన నిజాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. నిజాన్ని దాచిన వారే వ్యతిరేకిస్తున్నారు. భిన్నమైన దృక్కోణం ఉన్నవారు మరో కోణంలో కూడా సినిమా తీయవచ్చు” అంటూ చెప్పుకొచ్చారు.
Read Also : The Ghost : ఎడారిలో యాక్షన్.. నాగార్జున స్టంట్స్ స్టార్ట్
Also Read
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
- Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
- Akshaye Khanna: అసుర గురువుగా బాలీవుడ్ స్టార్.. ‘మహాకాళి’ నుంచి ఆగస్టు 24న అదిరిపోయే సర్ప్రైజ్!
- Will Smith: బన్నీకి ఎదురుగా విల్ స్మిత్.. ‘రాకా’లో ఈ కాంబో నిజమైతే రచ్చే!
‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాస్తవాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను మెచ్చుకునే బదులు, కాశ్మీర్ ఫైల్స్ను అప్రతిష్టపాలు చేయడానికి కొంతమంది పూనుకున్నారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1975 ఎమర్జెన్సీ లేదా విభజన వంటి అనేక అంశాలపై ప్రామాణికమైన సినిమాలు తీయాలని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రం మతపరమైన ఎజెండాను కలిగి ఉందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు కొన్ని వర్గాలు నుంచి ఎదుర్కొంటున్న విమర్శల మధ్య ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాదు కర్ణాటక శాసనసభ్యుల కోసం సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ కగేరి సోమవారం అన్నారు.రోజురోజుకూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా సపోర్ట్ పెరిగిపోతోంది.
తాజావార్తలు
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
-
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
-
Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!