‘అలా నిన్ను చేరి’, ‘సన్నీ లియోన్ మందిర’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజన్ మూవీ మేకర్స్, తమ మూడో చిత్రంగా ‘సుమతీ శతకం’ను తీసుకొస్తోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్తో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ఉగాది పర్వదినాన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. బండారు నాయుడు కథ అందించిన ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. హలేష్ సినిమాటోగ్రఫీని, సురేష్ విన్నకోట ఎడిటింగ్ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విజన్ మూవీ మేకర్స్ ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లనుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది.