Venky Atluri: దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది!
- వెంకీ అట్లూరి దిల్ రాజు వద్ద రైటర్గా పనిచేసిన అనుభవం తన దర్శకత్వ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెల్లడి!
- ‘మిస్టర్ మజ్ను’ కథను దిల్ రాజుకు చెప్పగా, నమ్మకం కోసం కలిసి పనిచేయాలని సలహా ఇచ్చారన్న వెంకీ అట్లూరి!
- ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న వెంకీ, టెన్షన్లో రాయడం తన విజయ రహస్యమని తెలిపారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన కెరీర్ మొదట్లో దిల్ రాజు దగ్గర రైటర్గా పనిచేసిన అనుభవం తన డైరెక్షన్ జర్నీకి బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు. తెలుగులో ఐదు సినిమాలు చేసిన ఆయన, ఇప్పుడు సూర్యతో ఆరవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన, దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. నిజానికి తాను ముందుగా నటుడిగా సినిమా చేశానని, అది వర్కౌట్ కాకపోవడంతో సినీ ఇండస్ట్రీలోనే ఉండాలని నిర్ణయించుకొని దర్శకుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు.
Also Read:Venky Atluri: అన్ని కథలు ముందు చైతూకే చెప్పా..కానీ?
Also Read
అందులో భాగంగానే ‘మిస్టర్ మజ్ను’ కథను దిల్ రాజుకు చెప్పగా, కథ నచ్చి తనకు ఇచ్చేయమని అడిగారని, కానీ తాను ఇవ్వనని చెప్పడంతో, “నీ మీద నమ్మకం కుదరాలంటే కొన్నాళ్లు నాతో ట్రావెల్ చేయాలి” అన్నారని తెలిపారు. అలా ‘కేరింత’ సినిమాకు పని మొదలుపెట్టానని, ఒక సందర్భంలో ఆ సినిమా ఆగిపోయిందని, తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత మళ్లీ ప్రారంభించామని చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో కూడా తాను వెళ్లేవాడినని, ఒక సందర్భంలో సీన్ నచ్చకపోతే ఆన్సైట్ ఇంప్రూవ్మెంట్ అడిగేవారని, అలాంటి టెన్షన్లో రాయడం వల్లే తాను దర్శకుడిగా సులభంగా సినిమాలు చేయగలుగుతున్నానని తెలిపారు. దిల్ రాజు వద్ద రైటర్గా టెన్షన్లో రాయించడం తన కెరీర్కు బాగా ఉపయోగపడిందని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!