Priyanka Chopra: నిక్లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!
- ‘వారణాసి’లో కథానాయికగా గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా
- విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ప్రియాంక
- రూమర్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వారణాసి షూటింగ్లో పాల్గొన్న ప్రియాంక.. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నారట. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె గట్టిగానే స్పందించారు. ‘మేము విడాకులు తీసుకుంటున్నామంటూ కొన్ని వార్తలు నా చెవిన పడ్డాయి. మా పెళ్లి బంధం ముగిసిపోవాలని కొందరు కోరుకుంటున్నారా? అనిపిస్తోంది. అసలు మా బంధం గురించి ఇలాంటి రూమర్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇదంతా వారి భ్రమ మాత్రమే. వేర్వేరు దేశాలు, వేర్వేరు మతాలు, మా మధ్య ఉన్న వయసు తేడా వల్ల కొందరికి మా బంధం ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. కానీ మేము ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నాం. ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం నేను ఎప్పుడో మానేశాను’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.
Also Read
- Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
- Telugu Film Federation: జానీ మాస్టర్కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
- Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
- Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?
తమ వివాహ ప్రయాణం గురించి ప్రియాంక చోప్రా చెబుతూ… ‘మా పరిచయం తర్వాత కేవలం ఆరు నెలల్లోనే పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో అసలు ఏం జరుగుతుందో, అది నిజమో కాదో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను. అయితే నిక్లో ఉన్న నిజాయతీ నన్ను ఆకర్షించింది’ అని చెప్పారు. కుటుంబ భద్రత విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని తెలిపారు. ‘నేను నా కుటుంబం, ముఖ్యంగా నా కుమార్తె భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరైనా నన్ను నేరుగా కలిసి ఫొటోలు తీసుకోవాలనుకుంటే నాకు ఇష్టమే. నాతో మాట్లాడటానికి వచ్చే వ్యక్తులను నేను గౌరవిస్తానని నా సెక్యూరిటీ గార్డులకు కూడా తెలుసు. కానీ అనుమతి లేకుండా దొంగ చాటుగా ఫొటోలు తీయడం నాకు నచ్చదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ఫోన్లు ఉంటున్నాయి. మేము పార్కులో ఉన్నా లేదా ఎక్కడైనా భోజనం చేస్తున్నా.. ఆ పిక్స్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందుకే నా కూతురి ప్రైవసీ కోసం సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాను. లేకపోతే నాకు వ్యక్తిగత భద్రత అవసరం లేదు’ అని వివరించారు.
తాజావార్తలు
-
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
-
Telugu Film Federation: జానీ మాస్టర్కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
-
Meaning of Life: ఎందుకు పుట్టాం? ఎందుకు జీవిస్తున్నాం? జీవితానికి అసలు అర్థం ఇదేనా?
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!