NTV Telugu Site icon

Tollywood: గద్దర్‌ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు.. ఛైర్మెన్ ఎవరంటే.?

Untitled Design (23)

Untitled Design (23)

టాలీవుడ్ సినీనటుల ఉత్తమ ప్రదర్శనకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డులను అంజేసేవారు. అప్పటి ప్రభుత్వాలు ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు కూడా. కానీ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ కాయక్రమాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నంది అవార్డులను ప్రకటించింది, విజేతలకు అవార్డులు అందజేశారు తప్ప వేడుక నిర్వహించలేదు. కానీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిశ్చయించింది.

Also Raed: Kiran Abbavaram: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన రాజావారు రాణిగారు.

ఈ ఏడాది  గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్​, నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది  గద్దర్ జయంతి రోజున ఆ పురస్కారాలు ఇస్తామని తెలిపారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఈ గురువారం గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక  కమిటీని నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు కొందరు సినీ ప్రముఖులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ  కమిటీకి ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు ఛైర్మన్​గా వ్యవహరించనుండగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్​రాజును వైస్ ఛైర్మన్​గా ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఈ కమిటీకి సలహాదారులుగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేశ్​ బాబు, చంద్రబోస్, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణులతోపాటు ఎఫ్​డీసీ ఎండీ మెంబర్ కన్వీనర్​గా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్​డీసీ ఈ కమిటీతో చర్చించి తదుపరి కార్యాచరణ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది