TFI: తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రాత్మక అడుగు.. ఇకపై డిజిటల్ దుష్ప్రచారానికి చెక్!
- తెలుగు సినీ పరిశ్రమలో చారిత్రాత్మక అడుగు
- ఇకపై డిజిటల్ దుష్ప్రచారానికి చెక్
- మన శంకర వరప్రసాద్ గారు’తో మొదలు
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిసారిగా సినిమాలపై జరుగుతున్న డిజిటల్ మానిప్యులేషన్, ఆన్లైన్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే దిశగా కీలక అడుగు పడింది. కోర్టు ఆదేశాల మేరకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించి టికెటింగ్ ప్లాట్ఫామ్లలో రేటింగ్స్, రివ్యూలను చట్టబద్ధంగా నియంత్రించేలా చర్యలు చేపట్టారు. దాంతో నిజమైన ప్రేక్షకుల తీర్పుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, కావాలని చేసే దుష్ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేని వినూత్న నిర్ణయంగా సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలి కాలంలో సినిమాలపై కృత్రిమ రివ్యూలు, బాట్స్, అజెండాతో నడిచే నెగటివ్ క్యాంపెయిన్లు పెరిగిపోయాయి. సినిమా విడుదలైన క్షణాల్లోనే నెగటివ్ టాక్ను వ్యాప్తి చేయడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా భారీ బడ్జెట్తో తెరకెక్కే సినిమాల భవిష్యత్తు కొందరి స్వార్థపూరిత ఎజెండాలతో బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ప్రేక్షకుల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు మాత్రమే కాకుండా మొత్తం క్రియేటివ్ ఎకోసిస్టమ్కు రక్షణ కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశం.
Also Read
- Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
- Tollywood Pan World Movies: అందరికీ 'పాన్ వరల్డ్ మూవీ'నే కావాలా?
- Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
- Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ సినిమా కోసం కోర్టు మద్దతుతో అమలైన ఈ డిజిటల్ సేఫ్గార్డ్స్.. భవిష్యత్తులో ఇతర సినిమాలకు కూడా మార్గదర్శకంగా నిలిచే అవకాశముంది. ఇది నైతికమైన డిజిటల్ ప్రవర్తనకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు. ఈ విప్లవాత్మక చర్యకు బ్లాక్బిగ్, ఐప్లెక్స్ సంస్థలు ముందుండి నడిచాయి. భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ సహకారం అందించడం విశేషం.
Also Read: Anil Ravipudi: వరసగా తొమ్మిదో విజయం.. ‘సంక్రాంతి’ మొనగాడు అనిల్ రావిపూడి!
ఈ సాహసోపేతమైన నిర్ణయంకు మద్దతు ఇచ్చిన షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్కు టాలీవుడ్ పరిశ్రమ తరఫున ప్రత్యేక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ సబోటేజ్కు చోటు లేకుండా, నిజమైన ప్రేక్షకుల తీర్పే సినిమాలకు ప్రమాణమవ్వాలన్న బలమైన సందేశాన్ని ఇస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ కాలానికి అనుగుణంగా మారుతూ.. సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాకుండా బాధ్యతాయుతమైన డిజిటల్ పాలనను అమలు చేస్తోందని ఇది తెలియజేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?