RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుకుమార్ డెబ్యూ మూవీ ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు డైరెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ, సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ తో దేవిశ్రీ, సుకుమార్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పెట్టాయంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్, దేవిశ్రీది సక్సెస్ఫుల్ కాంబోనే అయినా, ‘పుష్ప 2’ బిజిఎం విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో కొన్ని సీన్స్ రీ-రికార్డింగ్ వర్క్ ని ఎస్.ఎస్. తమన్తో చేయించాడు సుకుమార్. ‘పుష్ప 2’ కు దేవిశ్రీ అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు. టైటిల్ సాంగ్, ఫీలింగ్స్ కిస్సిక్, జాతర సాంగ్… దేనికదే అన్నట్టుగా సినిమాను మ్యూజికల్ హిట్ చేశాడు.
దేవిశ్రీ, చిరంజీవి కాంబోలో నాలుగు సినిమాలు వస్తే రెండు సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వచ్చిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కు పాటలు ప్రాణంగా నిలిచాయి. ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’ ఫ్లాప్ అయినా దేవిశ్రీ మాత్రం ఫెయిల్యూర్ కాలేదు. ‘వాల్తేరు వీరయ్య’ మ్యూజికల్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబో రిపీట్ అయింది. అయితే దేవిశ్రీని కాదని తమన్ను తీసుకున్నారు. ఈ లెక్కన రాంచరణ్, సుకుమార్ సినిమాలో కూడా దేవిశ్రీ ఉండడు అన్న టాక్ నడుస్తోంది. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ‘ఉప్పెన’కు దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. రెండో సినిమా ‘పెద్ది’ దగ్గరికి వచ్చేసరికి దేవిశ్రీని పక్కన పెట్టేసి రెహమాన్ను తీసుకున్నాడు. కెరీర్ మొదట్లో దేవిశ్రీని ఎంకరేజ్ చేసిన మెగా హీరోస్, ప్రెసెంట్ ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టేసారు అనిపించినా… సుకుమార్ త్వరలో తీయబోయే రాంచరణ్ మూవీకి మాత్రం దేవిశ్రీనే తీసుకుంటున్నారట.
Also Read
ఈ లెక్కల మాస్టర్ కి మ్యూజిక్ విషయంలో ఓ లెక్క ఉంది, ఆ లెక్క దేవిశ్రీనే. తన బలాన్ని పక్కన పెట్టేంత సాహసం సుకుమార్ చేయాలి అనుకోవడం లేదు. మేకింగ్ కంటే మ్యూజిక్కే బలమన్న సంగతి ఈ లెక్కల మాస్టర్ కి తెలియంది కాదు. దేవిశ్రీతో వచ్చిన ఒకటి రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ తో తన ఆయుధాన్ని పక్కన పెట్టేసేంత తెలివి తక్కువవాడు కాదు సుకుమార్. సుకుమార్ చెక్కుడుకి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ‘పుష్ప 2’ రిలీజ్ కి ముందే రాంచరణ్ సినిమా ప్రకటించారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ కాంబో రిపీట్ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ‘పుష్ప 2’ ను మించిన కథ కోసం లెక్కల మాస్టర్ టీం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో నెలలే కాదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావడానికి ఇంకొక నాలుగైదు నెలలు పడుతుందట. ఈ లెక్కన సినిమా 2027 మొదట్లో సెట్స్ పైకి రానుంది.
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
RSS: భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.. ఆయోధ్య నిందితులను శిక్షించాలన్న ఆర్ఎస్ఎస్
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?