మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా మీద ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఇది హనుమంతుడి గాథను ఆధారంగా చేసుకుని సంజీవని వేటకు వెళ్లిన కథగా మలుస్తున్నారని మైథాలజికల్ టచ్ ఉందని కొందరు అంటున్నారు. అలా కాదు దాన్ని ప్రేరణగా తీసుకుని నేటి కాలానికి తగినట్టు మార్చుకున్నారని కొందరు, ఇలా రకరకాల వాదనలు తెరమీదకు వస్తున్నాయి.
Nimmala Rama Naidu: చంద్రబాబు కృషితోనే పోలవరం ప్రాజెక్ట్కు భారీగా నిధులు..
అయితే మహేష్ బాబు సినిమా అంటేనే ప్రేక్షకులలో ఒక రకమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం అంతా నిజమేనా? అంటే ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి. ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఎలాంటి వివరాలు లీక్ కాకూడదని సినిమా మొదలు కాకముందే రాజమౌళి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ మీద సంతకాలు తీసుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒరిస్సాలో జరుగుతున్న షూటింగ్ నుంచి ఒక సీన్ లీక్ అయింది. దీంతో ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి. ఇక తాజాగా ప్రియాంక చోప్రా కూడా మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆమె ఒరిస్సాలోని లొకేషన్స్ కి వెళుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.