సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఆకట్టుకునే ప్రచార చిత్రాలు, వీడియోలతో ఈ సినిమా ఇప్పటికే మంచి ఆదరణను పొందుతోంది.
ఈ రోజు చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురంను సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. తన మార్క్ ఇంటెన్సిటీకి అందమైన ప్రేమకథ, పవర్ఫుల్ యాక్షన్ను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటల్లో జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ తమ క్యూట్ లుక్స్తో పాటు ఆకట్టుకునే నటనతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు.

