టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ . ‘రైటర్ పద్మభూషణ్’, ‘మ్యాడ్’ , ‘లవర్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన ‘చెనై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘వదలనే..’ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ సోమవారం (మే 25) రాత్రి హైదరాబాద్లో అత్యంత గ్రాండ్గా జరిగింది.
ఈ వేడుకలో తన దివంగత తల్లిని గుర్తుచేసుకుంటూ శ్రీ గౌరి ప్రియ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై ఆమె కన్నీళ్లు పెట్టుకున్న ఎమోషనల్ వీడియో (Introduction) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. గౌరి ప్రియ మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే.. మా అమ్మ నన్ను ఒంటరిని చేసి వదిలేసి వెళ్లిపోయి ఇప్పటికి మూడేళ్లయింది. కానీ, తను నన్ను అస్సలు వదల్లేదు.. నేను కూడా తనను ఎప్పటికీ వదలను. ఈ విషయం పైనున్న మా అమ్మకూ తెలుసు, ఇక్కడున్న నాకూ తెలుసు. అందుకే ఈ గుండెకు హత్తుకునే ‘వదలనే’ పాట లైన్స్ను నా ప్రాణమైన మా అమ్మకే డెడికేట్ చేస్తున్నాను’ అని చెప్తూ స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యారు.
గౌరి ప్రియ తల్లి పేరు వసుంధర మూడేళ్ల క్రితం క్యాన్సర్ (Cancer) మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు. అమ్మ అంటే గౌరి ప్రియకు ఒక తల్లిలా కంటే ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉండేవానే. కెరీర్ ఆరంభంలో తల్లి మరణించడంతో గౌరి ప్రియ తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. ఆ కఠినమైన రోజుల్లో తీవ్రంగా డిస్టర్బ్ అయిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని, మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తెలుగమ్మాయి అయినా కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా కోలీవుడ్లో కూడా మోడర్న్ లవ్ చెన్నై, మెయిల్ వంటి సిరీస్లతో మెప్పించింది గౌరి ప్రియ. ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో చేస్తున్న ‘చెనై లవ్ స్టోరీ’ (ఇప్పటికే దీనిలో తో పాటు ఆమె చేతిలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
