SP Charan: ఎస్పీ బాలు వాయిస్ వాడేశారు.. కీడా కోలా టీంకి ఎస్పీ చరణ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడో చనిపోయిన ఒక గాయకుడి గొంతును ఏఐ సహాయంతో మళ్లీ రీ క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రెహమాన్ కంటే ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ సహాయంతో రీ క్రియేట్ చేశారు. అయితే ఈ విషయం మీద ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కీడాకోలా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య రావు, జీవన్, విష్ణు వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అయితే ఒక చిన్న కామెడీ సీక్వెన్స్ లో భాగంగా మా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ ద్వారా రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. స్వాతిలో ముత్యమంత అనే సాంగ్ సినిమాలో ఒక కామెడీ సీక్వెన్స్ కోసం వాడారు. దాని కోసమే ఏఐ ద్వారా సాంగ్ రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read; Pakistan Army: ఇమ్రాన్ ఖాన్కు ప్రధాని పదవిని ఆఫర్ చేసిన పాక్ ఆర్మీ.. కానీ, కండిషన్స్ అప్లై
Also Read
ఈ విషయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన జనవరి 18వ తేదీన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సహా సినీ దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు పంపారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీద ఎస్పీ చరణ్ స్పందిస్తూ నాకు దూరమైన మా తండ్రి వాయిస్ ని ఏ ద్వారా రీ క్రియేట్ చేయడం బాగుంది , చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించిందనీ అన్నారు. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు’ అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే ఈ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్లాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!