బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి తాజాగా అస్సాం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం – ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికపై షేర్ చేసిన ఒక వివాదాస్పద వీడియో. ఏఐ సాయంతో రూపొందించిన ఆ వీడియోలో మైనారిటీ వర్గాన్ని కించపరిచే కంటెంట్ ఉండటంతో, ఇది మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని అనేక మంది అభిప్రాయపడ్డారు.
Also Read : Mrunal Thakur : ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది
రాబోయే ఏడాది అస్సాం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోసం ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నటి శ్రేయా ధన్వంతరి తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు.. “ఇది ఇండియా కాదు. ఈ వీడియో ద్వేషపూరితంగా ఉంది. ఇలాంటి హానికరమైన ప్రచారం ఎవరూ అడ్డుకోకుండా కొనసాగుతోందా? అసలేం జరుగుతోంది మన దేశంలో?” అంటూ ఆమె ప్రశ్నించారు. ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. శ్రేయా ధన్వంతరి మాత్రమే కాకుండా, పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బీజేపీని నేరుగా టార్గెట్ చేస్తూ పోస్ట్లు పెడుతుండగా, మరికొందరు ఇలాంటి రాజకీయ కుట్రలు వద్దు అంటూ వాపోతున్నారు. మొత్తంగా, ఈ ఘటన రాజకీయ, సినీ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. దేశ ఏకతా, మత సామరస్యాన్ని దెబ్బతీసే కంటెంట్ను అడ్డుకోవడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనేక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
This cannot be India. This is so hateful and wrong. Is this kind of hate mongering truly going to go unchecked? What is happening?! https://t.co/tfn8TbopdJ
— Shreya Dhanwanthary (@shreyadhan13) September 17, 2025